Home » Author » M N
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో విమర్శల ఘాటు పెంచిన ఉత్తరాంధ్ర నేతలు పవన్ టార్గెట్ గా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆ మధ్య పవన్ ఉత్తరాంధ్రలో కార్యక్రమం అనంతరం ఈ విమర్శల పదును మరింత పెరిగింది. మంత్రులు గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా పవన్ ప్రస్తావన లేకుండా వెళ్లే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు కూడా […]
Union Budget: నేడు కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై వివిధ రాష్ట్రాల నుండి ఒక్కోరకంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీ ఆర్థికశాఖ మంత్రి మాట్లాడుతూ కొన్ని శాఖలలో కేటాయింపులు తగ్గాయి కానీ.. ఓవరాల్ గా చూస్తే మంచి బడ్జెట్ అని.. రాజకీయాలను పక్కనబెట్టి అందరూ కేంద్రాన్ని ప్రశంసించాలని కూడా కోరారు. అయితే, తెలంగాణ నేతలు మాత్రం ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర […]
Union Budget: నేడు కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ మంచిదేనని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన బుగ్గన.. ఇది గుడ్ బడ్జెట్ అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, అన్ని రాష్ట్రాలు రాజకీయాలను పక్కన పెట్టి పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లు అయితే.. ప్రీ బడ్జెట్లో తాము చెప్పిన నాలుగు సూచనలను కేంద్రం పాటించినట్లు కనిపిస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్ లో […]
Medaram Jathara: పచ్చని అడవిలో ఎటు చూసినా జనమే కనిపిస్తారు.. మెట్రో నగరాల నుండి పల్లెల వరకు దారులన్నీ ఆ అడవి బాట పడతాయి. అదే మేడారం జాతర. మేడారంలో బుధవారం నుండి మినీ వన జాతర మొదలైంది. గిరిజనుల ఆరాధ్య దైవాలుగా కొలుస్తూ.. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు విశేషంగా దర్శించే సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర కొండాకోనా పరవశించేలా బుధవారం ప్రారంభమైంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచి, జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు […]
AP Capital: నిన్నటి వరకు ఏపీకి రాజధాని లేదని కొంతమంది వెటకారంగా మాట్లాడారు కదా.. ఇప్పుడు చెప్తున్నాం వాళ్లందరికీ.. మాది ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి.. గుర్తుపెట్టుకోండి అంటూ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పుడు ఘాటు పెంచి సమాధానం చెప్తున్నారు. శాసన పరంగా, అధికారికంగా రాజధాని విశాఖ కాకపోయినా.. సీఎం జగన్ ఢిల్లీలో విశాఖనే రాజధానని ప్రకటించిన నేపథ్యంలో ఇలా జోష్ పెంచారు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు జాతీయ రహదారి సమీపంలో […]
Telangana Govt: తెలంగాణలో నీటి పారుదల శాఖకి సంబంధించి మరో కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీనికోసం ఇప్పటికే ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసిన ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలలో.. లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో సభలో ప్రవేశపెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ఉన్న 18 వేర్వేరు చట్టాలను కలిపి ఒక కొత్త సమీకృత నీటిపారుదల చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముసాయిదాను కూడా సిద్ధం […]
Viveka Murder Case: మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఒకటికి రెండుసార్లు నోటీసులు ఇచ్చిన అనంతరం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ విచారణకి వెళ్లారు. అవినాష్ అడిగినట్లుగా తనతోపాటు లాయర్ ను సీబీఐ అనుమతించలేదు. అయితే, ఈ విచారణలో జరిగిన కొన్ని విషయాలు మీడియాలో బయటపడ్డాయి. అవినాష్ విచారణలో తన కాల్ డేటా ఆధారంగా కూడా విచారణ […]
Kotamreddy Sridhar Reddy: ఇంతకాలం వైఎస్ జగన్కు వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అనుకున్నట్లుగానే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి అభిమతాన్ని, ఆవేదనను వెల్లడించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమావేశంలో కోటంరెడ్డి […]
Jharkhand Fire Incident: జార్ఖండ్.. ధన్బాద్లో మంగళవారం రాత్రి ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 50 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ […]
TDP-YSRCP Activists: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాదికి పైనే ఉండగా.. ఒకవైపు నేతలు మాటలతోనే రెచ్చిపోతుంటే.. తామేం తక్కువ తిన్నామా అని కార్యకర్తలు ఏకంగా దాడులకు దిగుతున్నారు. గ్రామాలలో పార్టీ పిచ్చి.. పరువు సమస్యగా ఫీలయ్యే సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే.. ఈ మధ్య కాలంలో ఈ గొడవలు మరికాస్త ఎక్కువ అయినట్లు కనిపిస్తుంది. ఆ మధ్య పల్నాడు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి ఒకరిపై […]