Home » Author » M N
BRS Party: బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కేంద్రంపై సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. తెలంగాణపై కేంద్రం చిన్న చూపు అనే ఆలోచన.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనే ఆరోపణ, అన్నిటికి మించి రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రం కాలరాస్తుందనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో గవర్నర్, సీఎం మధ్య కాన్స్టిట్యూషనల్ వార్ జరుగుతుంది. అసెంబ్లీ […]
AP Capital: ఇప్పటికే ఏపీకి మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెల్లలో అమరావతిని అభివృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. […]
Atchannaidu: తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి.. తనకు తాను సింహాన్ని, పులిని అంటూ సినిమా డైలాగులు చెప్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తోడేళ్లన్నీ కలిసివస్తున్నాయని.. కానీ తాను మాత్రం సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేయనున్నట్లు తెలిపారు. భగవంతుని దయతో ప్రజలను నమ్ముకుని ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు జగన్ ప్రసంగించారు. దీంతో సింహం అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై అచ్చెన్నాయుడు […]
Roja Selvamani: ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కె. రోజా సెల్వమణికి మరో ప్రతిష్టాత్మకమైన పదవి దక్కింది. కేంద్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా మంత్రి రోజా నియామకం అయ్యారు. దీనికి సంబంధించి సెక్రటరి జితిన్ నర్వల్ సమాచారాన్ని సోమవారం నాడు అందించారు. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖా మంత్రులకు ఈ అవకాశం లభించింది. దక్షిణ భారతదేశం నుంచి మంత్రి ఆర్కే రోజా సెల్వమణిని స్పోర్ట్ అథారిటీ మెంబర్గా […]
CM Jagan: సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ మంగళవారం ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ సమావేశానికి పలువురు దౌత్యవేత్తలు హాజరవుతుండగా.. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్ తో పాటు ఉన్నతాధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆయన ఈ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆయన ఎక్కిన ప్రత్యేక విమానం […]
CM Jagan: రాష్ట్రంలో తోడేళ్ళన్నీ ఒక్కటి అవుతున్నాయని.. మీ బిడ్డకి ఎలాంటి పొత్తులు ఉండవని.. సింహం సింగిల్ గానే పోరాడుతుందని సీఎం జగన్ సినిమా స్టైల్ లో డైలాగ్స్ చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించిన సీఎం.. జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారులకు నిధులను పంపిణీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,30,145 మందికి రూ 330.15 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. దీని ద్వారా ఒక్కో లబ్ది దారుడుకు రూ.10 […]
Suicide Attempt: ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. కుటుంబం అంతా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తన భూమిని తీసుకున్న ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని.. ఉన్న భూమి పోయి బతుకుదెరువు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీం పట్నానికి చెందిన ఐలేష్ అనే వ్యక్తి భార్యతో సహా ప్రగతి భవన్ […]
Weather Update: ఒకవైపు చలి తీవ్రత ఎక్కువవుతుండగా మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం వాయుగుండంగా బలపడనుంది. శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం నాటికి ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత […]
Visakha Ukku Praja Garjana: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భాగంగా సోమవారం ఉక్కు నగరంలో ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నారు. కేంద్రం నవరత్నాల లాంటి ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపిస్తూ ఈ విశాఖ ఉక్కు గర్జన సాగనుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని […]
Telangana: తెలంగాణ రాజకీయాలలో రెండు రాజ్యాంగపరమైన అంశాలలో ఒకరకంగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య అగాధం కాస్త ఇప్పుడు రాజ్యాంగపరమైన వివాదంగా మారింది. చిన్న చిన్న అసంతృప్తులతో మొదలైన ఈ వివాదం కాస్త ఇప్పుడు కోర్టులలో పంచాయతీల వరకు వెళ్లేలా కనిపిస్తుంది. కేంద్రంపై ఉన్న అసంతృప్తిని కేసీఆర్ సర్కార్ ఇలా గవర్నర్ పై చూపిస్తుందనే ఆరోపణలు ఉండగా.. రాజ్యాంగపరంగా తన హక్కులను సర్కార్ పట్టించుకోవడం లేదని గవర్నర్ పంతాలకు పోతున్నారని విమర్శలు […]