Home » Author » M N
Capital Amaravati: జనవరి 31.. ఈ తేదీ కోసం ఏపీ రాజకీయ వర్గాలతో పాటు, ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కారణం.. ఏపీ రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్లు ఈరోజు విచారణకు వస్తాయని. ఒకవైపు ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై దాఖలు చేసిన పిటిషన్.. మరోవైపు అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా ఈరోజే సుప్రీంకోర్టు విచారిస్తుందని ఆశపడ్డారు. కానీ.. ఇతరత్రా కేసుల బిజీ వలన రాజధాని కేసు […]
BJP Chief Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రానున్న ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నాడు?. గతంలో పోటీ చేసి ఓడిన కరీంనగరా?.. లెక్కలన్నీ తేల్చిన వేములవాడనా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠగా మారిన వ్యవహారం. తెలంగాణలో గట్టిగా చూస్తే పది నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికారాన్ని నిలుపుకొని జాతీయ రాజకీయాలలో సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పీఠమెక్కి జాతీయ […]
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించే జిల్లా. గత ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసి గంపగుత్తగా జగన్ చేతిలో పెట్టారు. అయితే, ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. మొత్తం రాష్ట్ర రాజకీయాలలోనే నెల్లూరు నేతలు కాకపుట్టిస్తున్నారు. ఒకవైపు నెల్లూరు సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి లాంటి నేత తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. తన ఫోన్, తన పీఏ ఫోన్ కూడా ట్రాప్ చేస్తున్నారని […]
Janasena: ఎన్నికలలో ఓట్ల సంగతెలా ఉన్నా జనసేన అధినేతకి ఇటు సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా అభిమానులకు కొదువేలేదు. పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అంటే వంద మాటలు అనేలా విమర్శలకు దిగే అభిమానులతో పాటు పవన్ వస్తున్నాడంటే.. ఒకరోజు ముందే అక్కడ వాలిపోయే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే జనసేనాని విమర్శించిన వాళ్ళని చీల్చి చెండాడే వాళ్ళు కోట్లలోనే ఉన్నారు. అయితే, ఓ జనసైనికుడు మాత్రం భిన్నంగా ఓ గొప్ప […]
YSRCP MLA Anam: నమ్ము అంతం చేయాలనే కుట్ర జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని.. నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని కొందరు ప్లాన్ చేస్తున్నారని ఆనం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు […]
KTR Karimnagar Tour: తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎప్పుడో మొదలుపెట్టేశారు. ఇలాంటి తరుణంలో మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఆమధ్య నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే, మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత చోటచేసుకుంది. కేటీఆర్ […]
Hyderabad: సరదా కోసం చేసే కొన్ని పనులు చివరికి ఊహించని ప్రమాదాలకు కారణమవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొంతమంది యువతి యువకులు సెల్ఫీల కోసం, రీల్స్ కోసమని ఎంతకైనా తెగిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరగగా.. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. బ్రతుకుదెరువు కోసమని మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వచ్చిన యువకుడు.. హైదరాబాద్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ […]
NIA Court: అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతపై విమానాశ్రయంలో ఈ దాడి జరగడం.. అది రాజకీయంగా రగులుకోవడం.. అక్కడి నుండి ఆసక్తికర మలుపులు తీసుకుంది. సరిగ్గా ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ కోడికత్తి దాడి వైసీపీకి సానుభూతిపరంగా కూడా […]
Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మంగళహాట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జనవరి 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసులపై రాజాసింగ్ మంగళవారం స్పందిస్తూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని విమర్శించిన రాజాసింగ్.. నిజాం పాలనకు […]
YS Jagan: ఒకపక్క కోర్టు వివాదాలు, ప్రతిపక్షాల పోరాటాలు, రాజధాని తరలింపు వ్యతిరేక ఉద్యమాలు, నిరసనలు సంగతెలా ఉన్నా ఈ సారి రాజధాని విశాఖ వెళ్లిపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత మూడేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ సాగుతున్న ప్రచారాన్ని నిజం చేసేందుకు సీఎం రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు, మంత్రులే ఈ విషయంపై ప్రకటనలు చేస్తే.. ఈసారి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డే సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ రాజధాని విశాఖనే.. […]