Home » Author » M N
Kotamreddy Sridhar Reddy: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది ఉండగానే ఇప్పటికే ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీలో అంతర్గత పోరు కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా అధికార వైసీపీ వర్గ పోరులో నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కొందరు ఏకంగా అధిష్టానంపైనే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఎన్నికల్లో […]
Bachula Arjundu: టీడీపీకి మరో కష్టం ఎదురైంది. ఇప్పటికే నందమూరి కుటుంబసభ్యుడు, టీడీపీ యువనేత తారకరత్న గుండెపోటుతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఉన్నట్లుండి కుప్పగూలిపోవడంతో మొదట కుప్పం ఆసుపత్రికి అక్కడ నుండి బెంగళూరు హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదలా ఉండాగానే టీడీపీ మరో సీనియర్ నేత బచ్చుల అర్జునిడి గుండెపోటుకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు […]
BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు ప్రగతిభవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్లో ఈ పార్లమెంటరీ సమావేశం జరుగనున్నది. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో చర్చింబోయే అంశాలు, బడ్జెట్లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు […]
Taraka Ratna: టీడీపీ యువగళం పాదయాత్రలో పాల్గొని తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులో నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. కుప్పం నుండి బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్న తారకరత్న ఆరోగ్యంపై ఇటు నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తారకరత్న ఆసుపత్రిలో చేర్చిన దగ్గర నుండి బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తారకరత్న తల్లి, భార్య […]
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. పెరూ రాజధాని లిమాలో జరిగిన ఈ ఘటనలో 25 మంది మరణించగా.. అనేక మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. పెరూ కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. మొత్తం 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పెరూలో కొండపై నుంచి లోయలో […]
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ నేత వట్టి వసంత కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్ విశాఖలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో వట్టి సుదీర్ఘ కాలం పని చేశారు. వైఎస్ కు సన్నిహితుడుగా ఉండేవారు. వసంత్ కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల గ్రామం కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించారు. […]
BRS Party: ఒకవైపు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో సత్తా చాటుకోవాలని ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే ఖమ్మంలో భారీ బహిరంగ సభతో జాతీయ స్థాయిలో ఒక సంకేతాన్నిచ్చిన కేసీఆర్.. త్వరలోనే మహారాష్ట్రలోని నాందేడ్ లో మరో బహిరంగసభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల సమయానికి ఎలాగయినా బీఆర్ఎస్ వీలైనంత స్థాయిలో విస్తరించాలని ఆరాటపడుతున్నారు. అయితే, అదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు […]
Doctor Car Burnt: ప్రియురాలితో గొడవపడి ఏకంగా లక్షల విలువచేసే బెంజ్ కారును తగలబెట్టేశాడు ఓ యువ డాక్టర్. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు రూ.70 లక్షల విలువైన బెంజ్ కారు పూర్తిగా కాలిపోయింది. ధర్మపురికి చెందిన కవిన్ గత ఏడాది కాంచీపురంలోని ఓప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు ఆసుప్రతిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. కాలేజీ రోజుల నుండి అదే కాలేజీకి చెందిన కావ్యను ప్రేమించాడు. […]
Bandi Sanjay: బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు పోలీసులు నోటీసులిచ్చారు. హైదరాబాద్లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న బండి సాయి భగీరథ్ విద్యార్థిపై దాడి చేశాడన్న కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ దుండిగల్ పోలీసులు ఇప్పటికే బండి భగీరథపై CR. NO : 50/2023 u/s 341, 323, 504, 506 r/w 34 ఐపీసీ కింద కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం […]
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ శాఖలతో పాటు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాలలో ముమ్మర ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లుగా ఉండగా.. మరో ఏడాదికి పెంచే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలలో ప్రచారం జరుగుతుంది. వయసు పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోయినా రాష్ట్ర […]