BRS Party-Bandi Sanjay: బీఆర్ఎస్ తొలి జాతీయ సభ అట్టర్ ప్లాప్ అయిందన్న బండి సంజయ్!

Kaburulu

Kaburulu Desk

February 6, 2023 | 09:28 AM

BRS Party-Bandi Sanjay: బీఆర్ఎస్ తొలి జాతీయ సభ అట్టర్ ప్లాప్ అయిందన్న బండి సంజయ్!

BRS Party-Bandi Sanjay: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ అట్టర్ ప్లాప్ అయిందని, మహారాష్ట్ర జనం అసలు పట్టించుకోలేదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఈ మేరకు బీఆర్ఎస్ సభపై బండి సంజయ్ హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా బీఆర్ఎస్ సభ తుస్సు మందన్నారు.

ఈ సభ కోసం చివరకు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఒక్కొక్కరికి రూ.500లు ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి నాందేడ్ వేదికగా కేసీఆర్ పెద్ద డ్రామా చేశారని.. నాందేడ్ లో బీఆర్ఎస్ ను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. పెద్ద పెద్ద నాయకులు ఎవరెవరో చేరతారని ప్రచారం చేసుకున్నా.. చివరకు చేరిన అరొకర నాయకులంతా అవుట్ డేటేడ్ వాళ్లే.. సొంత ఊరిలోనే 10 ఓట్లు కూడా వేసుకోలేని నాయకులే ఉన్నారన్నారు.

వేల సంఖ్యలో బీఆర్ఎస్ కండువాలు తీసుకుపోతే.. ఆ కండువాలు పట్టుకుని కేసీఆర్ నిలబడ్డా.. ఎవరూ రాక విసుక్కున్నారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో అర్ధమవుతోందన్నారు. నరేంద్ర మోడీ ప్రధామంత్రి అయ్యాక భారత్ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చిందన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో మిగులు రాష్ట్రం కాస్తా రూ.5 లక్షల కోట్ల అప్పులపాలైందన్నారు. శివాజీ జన్మస్థలం నుంచి బిఆర్‌ఎస్ పార్టీ యాత్రలను ప్రారంభిస్తామని ఆ పార్టీ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు.

మహారాష్ట్రలో పేదలకు ఆవాస్ యోజన కింద 15 లక్షల 32 వేల ఇండ్లను అక్కడి ప్రభుత్వం కట్టించిందని.. తెలంగాణలో పేదలకు ఎన్ని ఇండ్లను నిర్మించి ఇచ్చారో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో ఆయుష్మాన్ భారత్ కింద కోట్లాదిమంది ప్రజలకు రోగమొస్తే పైసా భారం లేకుండా కార్పోరేట్ వైద్యం అందుతుందన్నారు. అయితే తెలంగాణలో ఏమి చేశారో బిఆర్‌ఎస్ పాలకులు చెప్పాలన్నారు.