శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్..
సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
లంగాఓణీలో శ్రీవారి మాడ వీధుల్లో సందడి చేసిన ఈ సిస్టర్స్..
అక్కడ సెల్ఫీలు దిగి, వాటిని ఇన్స్టా షేర్ చేశారు.
ఇది ఇలా ఉంటే, వీరితో పాటు తిరుమలకి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా కూడా వచ్చాడు.
శిఖర్ పహారియా, జాన్వీ డేటింగ్లో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.
తాజాగా తిరుమలలో జాన్వితో కలిసి శిఖర్ పహారియా కూడా..
పూజలు నిర్వహించడంతో మరోసారి వీరి డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.