Home » Author » M N
Remote Voting System: ఉపాధికోసం, పనులకోసం వేరే ప్రాంతాలకు వెళ్లినవారు ఓటరు గుర్తింపుని మాత్రం సొంత ఊరినుంచి బదిలి చేసుకోరు. సొంత ఊరిలో ఓటు ఉంటే స్థానిక గుర్తింపుగా వారు భావిస్తారు. అదే సమయంలో పోలింగ్ వేళ వారికి సొంత ఊరికి వచ్చే అవకాశం కొన్నిసార్లు ఉండకపోవచ్చు. దీనివల్ల భారత్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి వారికోసం సొంత నియోజకవర్గంలో జరిగే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఇస్తోంది రిమోట్ ఈవీఎం. […]
Hyderabad: హైదరాబాద్ నగరంలో పండగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ తార్నాకలోని రూపాలి అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే కుటుంబం బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది. నాలుగేళ్ళ చిన్నారితో పాటు దంపతులు, మరో మహిళా ఆత్మహత్యకి పాల్పడ్డారు. అపార్ట్మెంట్ వాసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. […]
BRS: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ సభలు, సమావేశాలతో ప్రజలలోకి వెళ్లేందుకు సిద్దమవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. మరోవైపు తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన జరగనున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నలుగురు […]
AndhraPradesh News: ఈ సృష్టిలో స్వార్ధం లేని ప్రేమ అమ్మ. అమృతం తాగిన వాళ్లు దేవతలు, దేవుళ్లు అంటారు. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ‘జగమే మరిపింపజేయునది కన్న తల్లి ప్రేమ.. శిశువైనా, పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే.. జననీ అను మాటలోనే తరయించు మనిషి జన్మ’ అన్నాడు ఓ సినీకవి. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం […]
K.A.Paul: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ రాజకీయాలను వదిలేయాలని.. లేదంటే తన పార్టీలో చేరాలని పాల్ ప్రకటించారు. అప్పుడప్పుడు పాల్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండే సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ జనసేన అధ్యక్షుడిపై పాల్ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంటుంటాయి. కాగా, మరోసారి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జనసేన […]
YS Viveka Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ రద్దుపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయమై విచారణ […]
Mir Mukkaram Jah: హైదరాబాద్ సంస్థానాన్ని ఏళ్లపాటు నిజాం వంశస్థులు పాలించిన విషయం తెలిసిందే. ఇక నిజాం వంశంలో ఎనిమిదవ నిజాం ముఖరమ్ జా బహదూర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని హైదరాబాద్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. శనివారం రాత్రి మరణించినట్లు తెలిపింది. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయనున్నట్లు నిజాం కుటుంబం ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని, సంస్థానాన్ని పాలించిన నిజాం ఉస్మాన్ […]
Vallabhaneni Vamsi: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉంది. అయినా.. ఇక్కడ పార్టీలు ఇప్పటి నుండే గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టారు. ఎవరికి వారు గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై ఫోకస్ పెట్టి కార్యాచరణ మొదలు పెట్టారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. ఇప్పటి వరకు తమని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అధికార పార్టీ నేతలను ఓడించేందుకు ఎత్తులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీలో గెలిచి వైసీపీ […]
Liquor Sale: ప్రజలను పాలించేది ప్రభుత్వమైతే.. ఆ ప్రభుత్వాలను నడిపించేది మద్యం. ఔను మన దేశంలో ఇప్పుడు మద్యంపై వచ్చే ఆదాయం మరే ఇతర దానిలో రాదంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు మందు బాబులు మత్తుగా ప్రభుత్వ ఖజానాలను నింపేస్తున్నారు. ఈ మధ్యనే నూతన సంవత్సర వేడుకల పుణ్యమా అని మన తెలుగు రాష్ట్రాలలో కూడా రికార్డ్ స్థాయి మద్యం వ్యాపారం జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో మద్యం వ్యాపారం కూడా ప్రభుత్వమే నడిపిస్తుండడంతో ప్రభుత్వానికి […]
Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎట్టకేలకి పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. అలాగే- 699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకూ ఆయన శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ సెమీ హైస్పీడ్ రైలును ఆదివారం ఉదయం 10.30 […]