AndhraPradesh: అమానుషం.. 10 నెల పసిమొగ్గని కడతేర్చిన కన్నతల్లి

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 02:00 PM

AndhraPradesh: అమానుషం.. 10 నెల పసిమొగ్గని కడతేర్చిన కన్నతల్లి

AndhraPradesh News: ఈ సృష్టిలో స్వార్ధం లేని ప్రేమ అమ్మ. అమృతం తాగిన వాళ్లు దేవతలు, దేవుళ్లు అంటారు. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ‘జగమే మరిపింపజేయునది కన్న తల్లి ప్రేమ.. శిశువైనా, పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే.. జననీ అను మాటలోనే తరయించు మనిషి జన్మ’ అన్నాడు ఓ సినీకవి. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం ఉంది.

ఎవరికైనా సేదతీరడానికి అమ్మ ఒడికి మించిన సరైన చోటు ఉండదు. ఇక చిన్న పిల్లలకైతే చెప్పాల్సిన పని లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ తల్లి ఒడే వారికి అన్నీ. అన్నం తినడానికి, గారాలు పోవడానికి ఇలా ప్రతి పనికి అమ్మ ఒడిని ఎంచుకుంటారు. అలాంటి అమ్మ ఒడే కసాయిగా మారి చిన్నారి ప్రాణం తీసింది. తన చిన్నిపొట్టకి పాలు తాగి ఒడిలో సేదదీరగా ఆ కసాయి తల్లి గొంతు నులిమి చిన్నారిని కడతేర్చింది.

తనకేమైనా జరిగితే తన చిన్నారిని ఎవరు చూస్తారనే భయమో.. తన మానసిక పరిస్థితిలో చిన్నారి భారంగా అనిపించిందో కానీ.. కసాయి తల్లే ముక్కు పచ్చలారని పసిమొగ్గని చిదిమేసింది. నిండా పదినెలల వయసులేని చిన్నారి అత్యంత భద్రతగా భావించే అమ్మఒడిలో ఉండగా ఆ అమ్మే చిన్నారిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లాలోని రాయచోటి మండలం నక్కలగుట్టలో మహమ్మద్ బాషా, ఫాతిమా దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి రుక్సానా అనే పది నెలల చిన్నా రి ఉంది.

ఫాతిమా గత కొంత కాలం నుంచి అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే రుక్సానాని గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం భర్త మహమ్మ ద్ బాషాకు జరిగిన విషయం చెప్పింది. బాషా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. తాను అనారోగ్యం కారణంగా దూరమైతే చిన్నారిని ఎవరు చూసుకుంటారనే భయంతోనే చిన్నారిని ఫాతిమా చంపేసిందని స్థానికులు చెప్తున్నారు.