Home » Author » M N
Minister KTR: తెలంగాణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరిన కేటీఆర్.. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్లకు జాతీయ ప్రాధాన్యత వుందని.. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్లకు ఆర్ధిక సాయం చేయాలని కేటీఆర్ కోరారు. అంతేకాదు, బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ […]
President Security: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాదాలు తాకేందుకు ప్రయత్నించిన అధికారినిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిని చేసిన పనికి కేంద్ర హోంశాఖ కఠినంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిని పనిని తప్పుబట్టడంతో హోంశాఖ అధికారినిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాజస్థాన్కు చెందిన ఓ మహిళా ఇంజినీర్ రాష్ట్రపతి ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజస్థాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షురాలు ద్రౌపది […]
Dharmana Prasada Rao: ఒకవైపు ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని బల్లగుద్ది చెప్తుండగా.. ఈనెల 31న సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాలలో కనిపిస్తుంది. ఇప్పటికీ అమరావతి రైతులు నిరసన గళం వినిపిస్తుండగా.. ఉగాది తర్వాత పరిపాలన విశాఖ నుండే కొనసాగనుందని.. ఈ మేరకు ప్రభుత్వంలో ముహూర్తం కూడా ఖరారైందని ప్రచారం జరిగిపోతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర నుండి కొత్త డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చి క్రమేపీ ఇది బలపడుతూ వస్తుంది. […]
Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఆదివారం అనగా ఈనెల 15 నుంచి ప్రారంభం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకూ నడిస్తుంది. సంక్రాంతి పండుగ కానుకగా అందిస్తున్న ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు శనివారం నుంచే టికెట్ బుకింగ్ లను […]
CM KCR: దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని చెప్పారు. ఇవాళ […]
YSRCP: భోగి పండగ సంబరాలు ఊరు వాడన అంబరాన్ని అంటుతున్నాయి. పిల్లా పాపలతో పల్లెలు సందడిగా మారగా.. యువతలో పండగా జోష్ మొదలయింది. ఇక.. ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే నేతలు కూడా రాజకీయాలను పక్కనపెట్టేసి పండగ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ తన సతీమణి భారతీరెడ్డితో కలిసి పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల […]
TDP: నారా – నందమూరి కుటుంబాలు సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. నారావారిపల్లెలో భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వచ్చిన ఆయన బావమరిది, నటుడు, ఎమ్మెల్యే బాలయ్య కుటుంబసభ్యులతో కలిసి భోగిమంటలు వేశారు. రెండు కుటుంబాలతో పాటుగా బంధువులు, గ్రామస్థులు వారితో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ మాట్లాడిన బాలయ్య రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. బాలయ్య ప్రతీ ఒక్కరినీ పలకరించి భోగి శుభాకాంక్షలు చెప్పడం విశేషం. తన సినిమా […]
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి సంతోక్ సింగ్ చౌదరి కన్నుమూశారు. పంజాబ్లోని ఫిల్లౌర్ వద్ద భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై రోడ్డుపై కుప్పకూలి పడిపోగా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన జలంధర్కు ఎంపీగా ఉన్నారు. ఎంపీ మృతితో రాహుల్ గాంధీ వెంటనే జోడో […]
Telangana News: పల్లెల్లో ఇప్పటికే పోస్ట్ మార్టంపై అనేక అనుమానాలున్నాయి. మృతిపై అనుమానులుంటే తప్ప మిగతా సందర్భాలలో పోస్టుమార్టం చేసేందుకు మృతుడి కుటుంబ సభ్యులు సుముఖంగా ఉండరు. చనిపోయాక కూడా మృతదేహాన్ని కోసి, కుట్లు వేయడం.. అవయవాలను కత్తిరిస్తారని ఎన్నో అపోహలు ఉండడంతో పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి మృతి చెందాడన్న సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహానికి […]
China COVID: డ్రాగన్ కంట్రీలో కరోనా వైరస్ అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. ప్రతి రోజు లక్షలాదిమంది వైరస్ బారినపడుతున్నారు. మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జీరో కొవిడ్ విధానాన్ని పాటించిన చైనా ఆ తర్వాత కరోనా ఆంక్షలు సడలించి, లాక్డౌన్లు ఎత్తివేసింది. దీంతో వైరస్ మరింతగా చెలరేగిపోయింది. రోజూ లక్షలాదిమందిని వైరస్ చుట్టుముడుతూ చైనా దేశాన్ని మహమ్మారి వణికిస్తుంది. తాజాగా, చైనాకు సంబంధించి మరో ఆందోళనకర […]