K.A.Paul: నేను పోటీ చేయకపోవడం వల్లనే టీడీపీ విజయం.. ఎమ్మెల్సీ ఎన్నికలపై పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

K.A.Paul: ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తాము, తమ పార్టీ పోటీ చేయకపోవడం వలనే టీడీపీ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాని మోడీకి బీ-పార్టీలని కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు, జగన్, కేసీఆర్, పవన్ కల్యాణ్ అన్ని విధాలుగా మోడీకి మద్దతు ఇస్తున్నారని పాల్ తెలిపారు. మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా? వీళ్లను నమ్మి మనం ఎందుకు మోసపోవాలని ప్రశ్నించారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేయలేదని, అందువల్లే టీడీపీ విజయం సాధించగలిగిందని పాల్ అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ లను చంద్రబాబుకు తానే పరిచయం చేశానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసని అన్నారు. కేసీఆర్ ను చూసి ఏపీలో జగన్ వాతలు పెట్టుకున్నాడని, తెలంగాణలో జిల్లా సంఖ్యల పెంచితే, ఏపీలో కూడా అదే పని చేశారని వెల్లడించారు.
ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీలు ఎలా ప్రజలను మోసం చేస్తున్నాయో మనం చూడొచ్చు అంటూ కేఏ పాల్ తెలిపారు. వచ్చే ఏడాది ఎంపీ స్థానానికి కూడా పోటీ చేస్తానంటూ చెప్పారు. ఇప్పుడుకున్న పార్టీలన్నీ కుల, కుటుంబ పాలనకే మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్ని కల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.. అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తానంటూ కేఏ పాల్ ప్రకటించారు.
తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. జూలై లేదా అగస్టులో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లేందుకు రెండు కారణాలున్నాయని.. రాష్ట్రానికి 25వేల కోట్లు అవసరం ఉందని ఆ డబ్బు కేసీఆర్ దగ్గర లేదని.. ఎందుకంటే తెలంగాణ అప్పుల పాలు అయిందని.. అందుకే ముందస్తుకు వెళ్తే లక్ష కోట్ల రూపాయలు మిగులుతాయని కేఏపాల్ వెల్లడించారు. తాను ఖమ్మం లేదా.. సికింద్రాబాద్ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కేఏ పాల్ వెల్లడించారు.