Thammineni Seetharam: కరెక్ట్ టైంలో సమాధానం చెబుతా.. ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఆరోపణలపై స్పీకర్ సీతారాం!

Thammineni Seetharam: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్లోని మహాత్మాగాంధీ లా కళాశాలలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో అడ్మిషన్ తీసుకున్నారని లేఖలో పేర్కొన్న ఆయన.. లా కోర్సు కోసం ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ సృష్టించారని ఆరోపించారు. తాను డిగ్రీ చదవలేదనే విషయాన్ని ఆయనే గతంలో ‘ఐ డ్రీమ్’ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారని గుర్తు చేశారు.
ఈ విషయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ఏపీ, తెలంగాణ గవర్నర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి జగన్కు కూడా సోమవారం లేఖలు రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లోనూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారని అన్నారు. తన అత్యున్నత విద్యార్హత ఇంటర్మీడియెట్ మాత్రమేనని, శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతూ మధ్యలోనే మానేశానని ఆయన స్వయంగా వెల్లడించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.
అలాగే, తమ్మినేని లా పరీక్షలకు హాజరైనట్టు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్ను, ఎన్నికల అఫిడవిట్ను కూడా ఆయన ఆ లేఖలకు జత చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్ తీసుకోవడం సరికాదని, విలువలకు, నైతిక ప్రవర్తనకు కట్టుబడలేదని, కాబట్టి ఆయన శిక్షార్హుడని, తమ్మినేనిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టంముందు అందరూ సమానమేనని చాటిచెప్పాలని ఆయన ఆ లేఖలో కోరారు.
కాగా, డిగ్రీ పాస్ కాకుండా బీఎల్ లా కోర్సులో ఎలా చేరారని చేసిన కూన రవి కుమార్ ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా స్పందించారు. సరైన సమయంలో సరైన సమాధానం చెబుతానని అన్నారు. ఎవరెవరూ ఏం చెబుతారో చెప్పనివ్వండని అన్నారు. అన్నింటికి ఒకేసారి వివరణ ఇస్తామని చెప్పారు. తనపై గవర్నర్కు, ఇతర ముఖ్యులకు ఫిర్యాదు చేస్తామంటున్న వారికి ఆ హక్కు ఉందని అన్నారు. వారు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. తాను తప్పు చేయనప్పుడు.. తనకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సరైన సమయంలో వివరణ ఇస్తానని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా (ఆముదాలవలస)
డిగ్రీ లేకుండా లా అడ్మిషన్.. వివాదంలో స్పీకర్ తమ్మినేనీ
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు కొత్త సమస్యలో చిక్కుకున్నారు. ఆయన విద్యార్హతపై వివాదం రేగుతోంది. అసలు డిగ్రీనే లేకుండా బీఎల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
టీడీపీ నేత, మాజీ… pic.twitter.com/eQsvu8lO0f
— JPR యువగళం (@JPRJayaPalReddY) March 27, 2023