Vellampalli Srinivas: అంబానీ లాంటి వారు పవన్ కు అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? వెల్లంపల్లి ఫైర్!

Vellampalli Srinivas: అంబానీ లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి వారికి కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో చాలా ఘనంగా జరిగిందని, భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని వెల్లంపల్లి అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రంలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, రాష్ట్రంలో ప్రత్యక్షంగా 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.
గతంలో ఇంతకుముందు చంద్రబాబు ఇంటి ముందు గూర్ఖాలు సూట్లు తొడిగి ఎంవోయూలు చేసుకునేవారని హేళన చేశారు. కానీ, సీఎం జగన్ ఏపీకి అంబానీ, అదానీ, జీఎంఆర్ వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకున్నారని.. అది సీఎం ఘనతని వ్యక్తపరిచారు. విశాఖ సదస్సు విజయవంతం కావడం పట్ల జాతీయ మీడియా మొత్తం జగన్ ను కొనియాడిందని, కానీ పచ్చమీడియా మాత్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు.
టీడీపీ నేత చంద్రబాబుపై కూడా వెల్లంపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే చంద్రబాబు ఒక్క రోజైనా పోలీసుల రక్షణ లేకుండా తిరగాలని వెల్లంపల్లి సవాల్ చేశారు. పోలీసులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్
ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని చెప్పారు. చంద్రబాబుకు ఎన్నికల కోడ్ రూల్స్ తెలియవా అని ప్రశ్నించారు.
2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల సంగతి తేలుస్తామని హెచ్చరించారు. వాళ్లు ఏమీ పీకలేరు అంటూ ఘాటు వార్నింగ్ కూడా ఇచ్చారు. విశాఖ గ్లోబల్ సదస్సు విజయవంతం అయిన నేపథ్యంలో విజయవాడలో సంబరాలు నిర్వహించారు.. కేక్ కట్ చేసి కార్యకర్తలతో విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు.. ఈ
సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.