CM KCR: తిమ్మాపూర్ లో కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ ప్రారంభాన్ని గుర్తుచేసుకున్న సీఎం!

CM KCR: సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో పర్యటిస్తున్నారు. తిరుమలగా పేరుగాంచిన తిమ్మాపూర్వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ లోని శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వర స్వామిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ దంపతులు మొదట బాన్సు వాడకు వెళ్లగా వారికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి తిమ్మాపూర్ లోని శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్బంగా దాతల సహాయంతో స్వామి వారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు.
ఆ తర్వాత సీఎం దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం దంపతుల వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, బీబీ పాటిల్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. వేంకటేశ్వరుని దర్శనం అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వెంకటేశ్వరస్వామని ప్రార్ధించినట్టుగా కేసీఆర్ చెప్పారు.
గతంలో తాను ఈ గుడికి వచ్చిన సమయంలో గుడి సాధారణంగా ఉండేదని.. ఇవాళ గుడి చుట్టూ పచ్చని పొలాలు, చెరువుతో ఆహ్లాదకరంగా ఉందని కేసీఆర్ చెప్పారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని.. అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసిన విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇక, తిమ్మాపూర్ ఆలయ అభివృద్దికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు.
CM Sri KCR addressing a public meeting at Thimmapur, Banswada Constituency after visiting Sri Venkateswara Swamy temple. https://t.co/4NUQZldAzr
— Telangana CMO (@TelanganaCMO) March 1, 2023