Srivari Theppothsavam: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు… ఎప్పటినుండో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

February 26, 2023 | 06:40 PM

Srivari Theppothsavam: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు… ఎప్పటినుండో తెలుసా…?

కలియుగ దైవంగా వెలసిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అనేకరకాల ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా సాలకట్ల తెప్పోత్సవం ఒకటి. మరి ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది దాని ప్రాముఖ్యత ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు.

తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనం ఇస్తారని వివరించారు. రెండవ రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో , 5,6 వ తేదీన శ్రీభూ సమేతంగా మలయప్పస్వామి ఐదుసార్లు పుష్కరిణిలో తిరిగి దర్శనం ఇస్తారని అన్నారు.

చివరి రోజు మార్చి 7న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో దర్శనం ఇస్తారని వివరించారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.