Love Story: ఫేస్ బుక్ ప్రేమ.. కులాంతర వివాహంతో బెదిరింపులు.. పోలీస్ స్టేషన్‌కి చేరిన ప్రేమ కథ!

Kaburulu

Kaburulu Desk

February 26, 2023 | 11:11 PM

Love Story: ఫేస్ బుక్ ప్రేమ.. కులాంతర వివాహంతో బెదిరింపులు.. పోలీస్ స్టేషన్‌కి చేరిన ప్రేమ కథ!

Love Story: ముందు ఫేస్ బుక్ లో అందరిలాగానే వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. కానీ, అందరిలా కాకుండా వాళ్లకి ప్రేమ చిగురించింది. దీంతో కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని నమ్మకంతో వాళ్లిద్దరే వేరుగా వెళ్లి పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. అది అమ్మాయి వాళ్లకి తెలియడంతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరులో ఈ సంఘటన జరిగింది.

ఆ ఇద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడగా.. కొంతకాలం తర్వాత అది ప్రేమగా మారింది.
పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ.. అమ్మాయి తరపు బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. చెందిన సంకుల గాయత్రి, మంగళగిరిలోని ఓ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అలాగే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన కాజ గణపతి ఓ మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నాడు.

అయితే, కొంతకాలం క్రితం ఆ ఇద్దరికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించుకున్న తర్వాత చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి అభిరుచులు కలవడంతో మనసులు కూడా కలిసిపోయాయి. ఇలా రెండున్నరేళ్లు ప్రేమించుకున్న వాళ్లిద్దరు చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే.. తమది కులాలు వేరు కావడంతో పెద్దలు కచ్ఛితంగా అంగీకరించరన్న విషయం గాయత్రి, గణపతి గ్రహించారు. దీంతో.. పెద్దలకు తెలియకుండా వారిద్దరూ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం గాయత్రి కుటుంబ సభ్యులకు తెలిసి తమకు తెలియకుండా, అది కూడా వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడంతో వాళ్లు కోపంతో రగిలిపోయారు. ఆ కోపంలోనే ఇద్దరిని చంపేస్తామంటూ బెదిరించారు.

దాంతో భయబ్రాంతులకు గురైన ఆ కొత్త జంట.. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించారు. తాము కులాంతర వివాహం చేసుకున్నామని, అయితే తమ పెళ్లిని గాయత్రి కుటుంబ పెద్దలు అంగీకరించడం లేదని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరువురి పెద్దల్ని పిలిచి, ఈ వ్యవహారం పరిష్కారం అయ్యేలా మాట్లాడుతామని పోలీసులు భరోసా కల్పించారు.