Home » Tag » TTD
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి రోజువారీ అవసరమయ్యే 4వేల లీటర్ల పాలను ఎస్వీ గోశాలలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ తయారు చేస్తున్న అగర బత్తీల ఉత్పత్తిని డిమాండ్ కు తగినట్లుగా పెంచే చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్వీ గోశాలలో నిర్మించిన ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసే అగరబత్తుల రెండవ యూనిట్ ను శుక్రవారం టీటీడీ చైర్మన్ […]
TTD-RBI: వడ్డీకాసుల వాడికే జరిమానా విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తిరుమల తిరుపతి దేవస్థానానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన ధార్మిక సంస్థగా గుర్తింపు ఉన్న టీటీడీ విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన అంశంపై ఆర్బీఐ టీటీడీకి ఈ జరిమానా వేసిందని, ఆ మొత్తాన్ని చెల్లించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు. భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీ విషయంలో ఈ […]
తిరుమల శ్రీవారికి రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన కీలక ప్రకటన చేసి, భక్తులను అలర్ట్ చేసింది… ఏప్రిల్ నెలకు గాను ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టికెట్లను ఈనెల 27వ తేదీన (ఎల్లుండి) విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని […]
కలియుగ దైవంగా భావించుకునే ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కలియుగ వైకుంఠం తిరుమలలో ఎటు చూసినా గోవింద నామ స్మరణే. ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు భక్తులు. తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పించుంటున్నారు. అలా.. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. దేశంలో ఏ దేవాలయంకు లేని విధంగా ఆదాయంలో ముందు నిలిచింది. కోవిడ్ ఎన్నో వ్యవస్థలపైనా ప్రభావం చూపింది. మహమ్మారి అన్ని రంగాలను వెంటాడింది.. ఆర్థికంగా దెబ్బతీసింది. […]
Nara Devaansh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకీ తిరుమల కొండపై ఒకరోజు అన్న ప్రసాద వితరణ కోసం లోకేశ్ కుటుంబం భారీ విరాళం ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా రూ.33 లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు. తిరుమలలో […]
Chaganti Koteswara Rao: టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జనవరిలో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న వివిధ పారాయణాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటి కోటేశ్వరరావును ఎంచుకున్నట్లు కమిటీ సూచించిందని ఆనాడు సుబ్బారెడ్డి వెల్లడించారు. అయితే, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు […]
Tirumala Tirupati: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి కరుణా కటాక్షాల కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాదు ప్రపంచ నలుమూలల నుండి వేచి ఉంటారు. ఆ ఏడుకొండలు ఎక్కి వెంకన్నన్ని దర్శించుకుని పరవశించిపోతుంటారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన తమిళనాడు, కర్ణాటక ప్రజలైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అయితే, ఇకపై అలా కుదరదు. ఎందుకంటే, నేటి నుంచి తిరుమలకు వచ్చే భక్తులను నెలకి ఒకసారి మాత్రమే అనుమతించనున్నారు. దాని కోసం ఫేస్ […]
కలియుగ దైవంగా వెలసిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అనేకరకాల ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా సాలకట్ల తెప్పోత్సవం ఒకటి. మరి ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది దాని ప్రాముఖ్యత ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి […]
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన స్వామి వారి దర్శనాలకు ఆన్ లైన్ లో డిమాండ్ పెరుగుతోంది. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసింది. ఆరు లక్షల టికెట్లను కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టికెట్లను రోజుకు 750 చొప్పున టీటీడీ రిలీజ్ […]
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేసే విధంగా మరో నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా టీటీడీ మరో ప్రయత్నం చేస్తోంది. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించే ఆలోచనలో ఉంది. తిరుమలలో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేసేలా తాటాకు బుట్టలను ప్రయోగత్మకంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ తాటాకులతో వివిధ సైజ్ ల్లో తయారు చేసిన […]