Delhi liquor scam: ఢిల్లీ మద్యం స్కాంలో తర్వాత అరెస్ట్ ఎవరు? కవిత అరెస్ట్ ఆధారాల కోసం సీబీఐ పాట్లు!

Kaburulu

Kaburulu Desk

March 5, 2023 | 05:17 PM

Delhi liquor scam: ఢిల్లీ మద్యం స్కాంలో తర్వాత అరెస్ట్ ఎవరు? కవిత అరెస్ట్ ఆధారాల కోసం సీబీఐ పాట్లు!

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తర్వాత అరెస్ట్ అయ్యేది ఎవరు? సీబీఐ ఏ దిశగా ఈ స్కాములో విచారణ చేస్తుంది? ఈ స్కాంలో మనీలాండరింగ్ అధరాలు ఏమైనా దొరికాయా? ఈ కేసులో సీబీఐ విచారణ ఇప్పుడు ఎవరి చుట్టూ తిరగనుంది? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా చర్చకు దారితీస్తున్న అంశం. అయితే, ఈ కేసు గురించి అవగాహన ఉన్న వాళ్ళు, సీబీఐ విచారణ సాగుతున్న తీరును చూస్తే తెలంగాణ సీఎం కుమార్తె కవితను అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు.

ఈ కేసులో సీబీఐ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటికే పలు రకాల ఆధారాలను సేకరించిన సీబీఐ ఇప్పటికే ఒకసారి ఆమెను విచారించింది. సౌత్ డీల్ ఆమె ద్వారా జరిగినట్టు గుర్తించింది. మూడు నెలల కాలంలో ఎన్ని మొబైల్స్ మార్చారో? మనీ లాండరింగ్ ఎలా జరిగింది? అని నిరూపించడానికి సీబీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా ఇప్పటికే లైగర్ సినిమా నిధుల గురించి కూడా ఆరా తీయగా ఈ స్కాంలో కవిత
ప్రమేయంపై ఒక ఫైల్ కూడా తయారు అయినట్లు చెప్తున్నారు.

అయితే ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తరువాత ఇక కవిత అరెస్ట్ ఖాయమని హస్తినలో టాక్ నడుస్తుంది. మరోవైపు, ఢిల్లీ వేదికగా తెలంగాణ కోసం ధర్నాకు కవిత సిద్ధం అవుతున్నారు. ఇక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా దీన్ని తనకు మైలేజీ వచ్చే దిశగా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు గ్రామాల స్థాయి వరకు మోడీ వ్యతిరేక ధర్నాలకు పిలుపు ఇస్తున్నారు.

కాగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సిసోడియాకు మద్దతుగా నిలిచిన విపక్ష పార్టీలు.. మోడీకి ఘాటు లేఖ రాశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ సీఎంలు కేసీఆర్, మమతా బెనర్జీ, భగవంత్ మాన్ అరవింద్, కేజ్రీవాల్ సహా
ప్రతిపక్ష నేతలు సంతకం చేసిన లేఖలో మోడీ సర్కార్ తీరును తూర్పార పట్టాయి. ఈ లేఖకు కాంగ్రెస్ దూరంగా ఉండగా.. ఉద్దవ్ ఠాక్రే, అధినేత అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ తదితరులు ఈ లేఖపై సంతకం చేయడం విశేషం.