Sai Dharam Tej : నాకు ఆల్రెడీ పెళ్లి అయ్యిపోయింది.. సాయి ధరమ్ తేజ్!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకడు. కాగా ఈ హీరో ఇప్పుడు ఒక షాక్ న్యూస్ చెప్పాడు. తనకి ఆల్రెడీ పెళ్లి అయ్యిపోయింది అంటూ వ్యాఖ్యలు చేశాడు.

Sai Dharam Tej : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకడు. కాగా ఈ హీరో ఇప్పుడు ఒక షాక్ న్యూస్ చెప్పాడు. తనకి ఆల్రెడీ పెళ్లి అయ్యిపోయింది అంటూ వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ యువహీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యం విష్ణు కథ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ చేశాడు. కిరణ్ మొదటిసారి గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ లో చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ ని సాయి ధరమ్ తేజ్ లాంచ్ చేశాడు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సాయి ధరమ్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించారు. దానికి బదులిస్తూ.. మీరు ఆడవాళ్లకి ఎప్పుడైతే గౌరవం ఇస్తారో, నేను అప్పుడే చేసుకుంటా అని వెల్లడించాడు. దానికి మేము ఆల్రెడీ గౌరవం ఇస్తున్నాము అన్నా అంటూ ఫ్యాన్స్ బదులిచ్చారు. ఈ మాటలకి సాయి ధరమ్.. అవునా అయితే నాకు ఆల్రెడీ నాలుగు సార్లు పెళ్లి అయ్యింది అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
కాగా ప్రస్తుతం ఈ సుప్రీమ్ హీరో ‘విరూపాక్ష’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మిస్టికల్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తున్నాడు. అతని శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ సాయి ధరమ్ తేజ్ సరసన ఈ మూవీలో నటిస్తుంది. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.