Home » Tag » tdp
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో ప్రారంభమైన యాత్ర 7వ రోజు పూర్తయింది. ఈ రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరులో జరిగిన పాదయాత్ర పట్టణంలో ఉండగా నారా లోకేశ్ ఒక చోట యాత్రను ఆపి తన ప్రచార రథం పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రథం దిగి ముందుకు వెళ్తుండగా.. ప్రచార రథాన్ని సీజ్ చేస్తున్నట్లు పలమనేరు […]
Kotamreddy Sridhar Reddy: ఇంతకాలం వైఎస్ జగన్కు వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అనుకున్నట్లుగానే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి అభిమతాన్ని, ఆవేదనను వెల్లడించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమావేశంలో కోటంరెడ్డి […]
TDP-YSRCP Activists: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాదికి పైనే ఉండగా.. ఒకవైపు నేతలు మాటలతోనే రెచ్చిపోతుంటే.. తామేం తక్కువ తిన్నామా అని కార్యకర్తలు ఏకంగా దాడులకు దిగుతున్నారు. గ్రామాలలో పార్టీ పిచ్చి.. పరువు సమస్యగా ఫీలయ్యే సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే.. ఈ మధ్య కాలంలో ఈ గొడవలు మరికాస్త ఎక్కువ అయినట్లు కనిపిస్తుంది. ఆ మధ్య పల్నాడు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి ఒకరిపై […]
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించే జిల్లా. గత ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసి గంపగుత్తగా జగన్ చేతిలో పెట్టారు. అయితే, ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. మొత్తం రాష్ట్ర రాజకీయాలలోనే నెల్లూరు నేతలు కాకపుట్టిస్తున్నారు. ఒకవైపు నెల్లూరు సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి లాంటి నేత తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. తన ఫోన్, తన పీఏ ఫోన్ కూడా ట్రాప్ చేస్తున్నారని […]
Atchannaidu: తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి.. తనకు తాను సింహాన్ని, పులిని అంటూ సినిమా డైలాగులు చెప్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తోడేళ్లన్నీ కలిసివస్తున్నాయని.. కానీ తాను మాత్రం సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేయనున్నట్లు తెలిపారు. భగవంతుని దయతో ప్రజలను నమ్ముకుని ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు జగన్ ప్రసంగించారు. దీంతో సింహం అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై అచ్చెన్నాయుడు […]
Visakha Ukku Praja Garjana: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భాగంగా సోమవారం ఉక్కు నగరంలో ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నారు. కేంద్రం నవరత్నాల లాంటి ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపిస్తూ ఈ విశాఖ ఉక్కు గర్జన సాగనుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని […]
Ambati Rambabu: ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టి అధికార పార్టీని ఎండగడుతుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం నుండి మంత్రుల వరకు అందరినీ తూర్పారా పట్టేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టే పనిలో ఉన్నారు. మొత్తంగా మాటకి మాట అన్నట్లు రాజకీయం రసకందాయంగా సాగుతుంది. నారా లోకేశ్ పాదయాత్రలో చేసిన వ్యమర్శలపై […]
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్ర యువగళం ఈరోజు నుండి ప్రారంభం కాబోతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఒకరోజు ముందే కుప్పం చేరుకున్న లోకేష్ కు ఇక్కడ మహిళా కార్యకర్తలలు ఘనస్వాగతం పలికారు. కాగా, నేడు శుక్రవారం ఉదయం కుప్పంలో 10.15 గంటల సమయంలో వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. మొత్తం 400 రోజుల పాటు 4 […]
Janasena: ఇప్పటికీ తాము బీజేపీతో పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. తన ఎన్నికల ప్రచారం రథం వారాహికి పూజా కార్యక్రమాల కోసం కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ-జనసేన-బీజేపీల పొత్తుతో 2014 కాంబినేషన్ పై కాలమే సమాధానం చెబుతుందన్నారు. ప్రస్తుతానికి బీజేపీతో కలసి ఉన్నామన్న జనసేనాని.. ఎవరు కలసి వస్తే వాళ్ళతో పొత్తుకు వెళ్తామని, […]
TDP: గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగు దేశం పార్టీలో కొత్త లొల్లి మొదలైంది. నరసరావుపేట ఎంపీ టికెట్ కొత్త వాళ్లకి ఇవ్వనున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుండడంతో అక్కడ సిట్టింగ్ క్యాండిడేట్, పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అలెర్ట్ అయ్యారు. కొత్తవాళ్ళని ఇక్కడకి తీసుకొస్తే సహకరించేది లేదని.. ఓడించి పంపిస్తామని కూడా రాయపాటి అధిష్టానానికి బహిరంగంగానే హెచ్చరికలు జారీచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా […]