Home » Tag » AP Govt
AP High Court: కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామజోగయ్య ఈ నెల 6న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది. కాపులు ఆర్ధికంగా నేటికి వెనుకబడి ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది పొలిశెట్టి రాధాకృష్ణ […]
CM Jagan: త్వరలోనే రాజధాని నుండి పరిపాలన మొదలు పెడతాం.. నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నా.. ఏపీ రాజధాని విశాఖనే. ఇదీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఈ ఒక్క మాటతో రాజధాని విశాఖ తరలింపులో ఇటు అధికారులతో పాటు వైసీపీ నేతలలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా.. అక్కడ తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగానే ఉంది. తీర్పు ఎలా ఉన్నా […]
AP Govt: జీతాలు సకాలంలో వచ్చేలా చూడండి మహాప్రభో అంటూ ఏపీ ఉద్యోగ సంఘం ఒకటి గవర్నర్ బీబీ హరిచందన్ ను కలిసి విన్నవించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్కు ఫిర్యాదు చేయటం రోసాకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అయితే వాటిని వినియోగించకుండా గవర్న ర్ ను ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. […]
AP CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. రేపు ఎల్లుండి అనగా సోమ, మంగళ వారాలు రెండు రోజులపాటు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెల 30, 31 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనుండగా.. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరి 6.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. వన్ జన్పథ్ నివాసంలో రాత్రికి […]
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ శాఖలతో పాటు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాలలో ముమ్మర ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లుగా ఉండగా.. మరో ఏడాదికి పెంచే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలలో ప్రచారం జరుగుతుంది. వయసు పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోయినా రాష్ట్ర […]
Viveka Murder Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం ఒకసారి సీబీఐ అధికారులు నోటీసులు అందించగా.. అవినాష్ నాలుగు రోజుల […]
AP Capital: అదేంటో రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఏపీ రాజధాని అంశం తేలడం లేదు. గత ప్రభుత్వం వేసిన అమరావతి పునాదులను ఎక్కడివక్కడే వదిలేసి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు నినాదం ఎత్తుకోగా.. అది కాస్త ఇప్పుడు కోర్టు వివాదాలలో చిక్కుకుంది. దీంతో ఉన్న రాజధాని ఎదిగే మార్గం లేక.. సీఎం జగన్ చెప్పే మూడు రాజధానులు ఎప్పటికి వస్తాయో తెలియక.. మొత్తానికి రాష్ట్రానికి రాజధాని అంశంలో అతీ గతీ లేకుండా […]
AP High Court: ఏపీలో ఇకపై ఫ్లెక్సీ అనేది కనిపించకూడదు.. నేటి నుండే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేదిస్తున్నా.. ఇదీ గత ఏడాది సీఎం జగన్ ఓ సందర్భంలో చెప్పిన మాట. అందుకు అనుగుణంగానే గత ఏడాది నవంబర్ ఒకటి నుండి ఈ నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. అయితే క్లాత్ బ్యానర్ల కోసం సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని సమర్చుకునేందుకు.. తగిన సమయం ఇవ్వాలని ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తి మేరకు అప్పుడు సీఎం జగన్ […]
Viveka Murder Case: మాజీ సీఎం వైఎస్ఆర్ సోదరుడు, సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పుంజుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు తెలంగాణకు విచారణ మారిన తర్వాత సీబీఐ జోరు పెంచింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో అనుమానాలతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి విచారణకు నోటీసులు ఇచ్చింది. అయితే తనకు ముందుగా ప్రణాళికలు కొన్ని ఉన్నందున అవినాష్ గడువు కావాలని కోరారు. […]
AP Govt: తమ జీతాలు ఆలస్యమవుతున్నాయని.. నెల పొడవునా జీతాలు అసలు ఎప్పుడు జమ అవుతాయో కూడా తెలియడం లేదని.. పెన్షన్లు, బకాయిలు నెలాఖరు వరకు కూడా జమ కావడం లేదని.. ఉద్యోగుల అనుమతి లేకుండానే ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎస్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారని.. మీ అధికారాలను ఉపయోగించుకొని జీతాలు సమయానికి అందేలా చూడాలని ఒక ఏపీ ఉద్యోగుల సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు గవర్నర్ […]