Kiran Kumar Reddy: కమలం గూటికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. జాతీయ స్థాయిలో బాధ్యతలు?

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 05:09 PM

Kiran Kumar Reddy: కమలం గూటికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. జాతీయ స్థాయిలో బాధ్యతలు?

Kiran Kumar Reddy: ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పిన.. కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా ప్రస్తుతం అక్కడ కూడా యాక్టివ్‌గా లేరు. కాగా, ఇప్పుడు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వస్తున్న కథనాల ప్రకారం ఇప్పటికే బీజేపీ అధినేతలతో, పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే మరికొద్ది రోజుల్లోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. కమలం గూటికి చేరుతారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఆయన తెలంగాణ, జాతీయ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌గా ఉండబోతున్నారని తెలుస్తోంది.

కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ.. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే వస్తున్న కథనాల ప్రకారం ఇప్పటికే బీజేపీ అధినేతలతో, పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీలోకి నల్లారి చేరికపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికను సోము వీర్రాజు స్వాగతించారు.

అంతేకాదు, కిరణ్ కుమార్ రెడ్డి చురుకైన నాయకుడని.. కిరణ్ చేరిక రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. అతనికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ ఎలాంటి పదవిని అప్పగిస్తుందనేది చర్చగా మారింది. కరుడు గట్టిన సమైక్యవాదిగా అసలు ఆయనకు తెలంగాణలో సపోర్ట్ లభిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న కాగా.. రాయలసీమలో బీజేపీ వ్యూహాల కోసం కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.