Home » Author » M N
TDP Rally: చిత్తూరు జిల్లాలోని కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు ర్యాలీ వద్దకు బయలుదేరారు. అయితే.. ర్యాలీకి పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త శృతి మించడంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. శాంతిపురం మండలం ఎస్.గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ […]
IT Rides: హైదరాబాద్లో ఐటీ రైడ్స్ హడలెత్తిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 కార్లు, మూడు సీఆర్పీఎఫ్ బస్సులలో వచ్చిన అధికారులు భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో మొదలు పెట్టిన ఐటీ సోదాలు.. 20 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు మొదలు పెట్టారు. గచ్చిబౌలి, బాచుపల్లి, చందా నగర్లోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తంగా 18 చోట్ల ఐటీ సాదాలు […]
Chinta Mohan: 2024 ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఊహించని పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై తీసుకొచ్చిన జీవోపై స్పందించిన చింతా.. తొక్కిసలాటను సాకుగా చూపి వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. స్వేచ్చ ఉన్న దేశంలో మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు సరికాదన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రానున్న 2024 […]
YSRCP: ఏడాది మారింది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అందుకే రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలతో దూకుడు పెంచారు. ఇన్నాళ్లు చూద్దాం.. చేద్దాం అన్నట్లే ఉన్నా.. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. ఎక్కడిక్కడ అస్ఫతృప్తి వెళ్లగక్కే నేతలను కట్టడి చేసే పని మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలకు […]
Kuppam Tour: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మేరకు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కు నోటీసులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా వచ్చిన ఉత్తర్వుల […]
YSRCP: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు కీలక సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. ఇది కేవలం ఇంచార్జి బాధ్యతల నుండి తొలగించడం మాత్రమే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆనం ఛరిస్మాను తగ్గించేందుకే […]
CM Jagan: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగా.. రాజకీయ పార్టీలలో ఆ సందడి మాత్రం మొదలైంది. ప్రతిపక్ష నేతలు ఏదో ఒక పేరు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తుంటే.. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో పలు కార్యక్రమాల జోరు పెంచినట్లుగా కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మరో […]
TDP: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. కానీ.. ఇక్కడ రాజకీయం మాత్రం ఇప్పటికే పీక్స్ కు చేరింది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు యాత్రలకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వం ఇంకేం చేస్తే మళ్ళీ అధికారం వస్తుందా అని వేటలో పడింది. ఇదిలా సాగుతుండగానే అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎవరికి వారు సీట్ల వ్యవహారంపై విన్నపాలు.. అలకలు కూడా మొదలు పెట్టేస్తున్నారు. అధికారంలో ఉన్నారు కనుక వైసీపీలో ఇప్పుడు ఈ సీట్ల గోల బయటపడదు కానీ.. టీడీపీలో మాత్రం […]
Green Challenge: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన కార్యక్రమాలలో హరిత హారం కూడా ఒకటి. సీఎం కేసీఆర్ 3 జూలై 2015న చిలుకూరు బాలాజీ దేవాలయంలో రూ.550 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించగా.. అప్పటి నుంచి ఊరు ఊరునా.. వాడ వాడనా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. పల్లెల నుండి నగరాల వరకు కొంతమేర ఈ కార్యక్రమం తర్వాత పచ్చదనం పెరిగింది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కు […]
V.V.Lakshmi Narayana: వీవీ లక్ష్మి నారాయణ.. ఇలా చెప్తే ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటే మాత్రం తెలుగు ప్రజలు ఈజీగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సీబీఐ అధికారి రిటైర్మెంట్ తర్వాత ప్రజా సమస్యలు.. రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినా ఈయన ఇప్పుడు మరోసారి […]