Home » Author » M N
Kerala: కేరళలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆలోచనలో పడేస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీనే కనిపిస్తుంది. ఎన్నో సంస్థలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫుడ్ డెలివరీలలో ఎక్కువ శాతం బిర్యానీనే కనిపిస్తుంది. ఫుడ్ డెలివరీ సంస్థలు నిర్వహించే సర్వేలలో కూడా ఈ బిర్యానీ ఎక్కువ ఆర్డర్లుగా రికార్డులు సృష్టిస్తుంది. అయితే.. బిర్యానీ తిన్న ఓ యువతి మృతి చెందింది. కేరళలోని […]
BRS Party: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాస్త జాతీయ గుర్తింపు ఉండేలా బీఆర్ఎస్ గా మార్చి ప్రచారం ప్రారంభించారు. ముందుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డ కేసీఆర్.. ఇటీవల ఏపీకి చెందిన కొందరు ప్రముఖులను పార్టీలో చేర్చుకున్న సంగతి కూడా తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారికి రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించిన కేసీఆర్.. మరికొందరు నేతలకు కూడా కండువాలు కప్పి ఘన […]
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి తర్వాత తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ శ్రేణులకు సూత్రప్రాయంగా తెలియజేసినట్లు తెలుస్తుంది. దక్షిణ మధ్య రైల్వేకు తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మంజూరయిన విషయం తెలిసిందే. మనదేశంలో ఇప్పటి వరకు ఏడు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించగా అవి మన రైల్వే ట్రాక్ మీద పరుగులు పెడుతున్నాయి. కాగా.. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఎనిమిదవ రైలు సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో పరుగులు పెట్టనుంది. […]
Botsa Satyanarayana: ఏపీలో సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో 1పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభలు ర్యాలీలో 11 మంది మృతితో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది.. గుంటూరులో ముగ్గురు తొక్కిసలాటలో మరణించగా.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో ఆంక్షలు విధిస్తూ జీవో 1 తెచ్చింది. అయితే.. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన […]
Bandi Sanjay: గుర్తు పెట్టుకోండి మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనమంతా సిద్ధంగా ఉండాలి. ఇదీ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన కామెంట్స్. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయంలో పార్టీ పోలింగ్ బూత్ కమిటీలు కీలకపాత్రను పోషిస్తాయని చెప్పిన ఆయన.. ప్రధాని మోదీ సైతం పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పని చేశారని.. పార్టీకి పోలింగ్ బూత్ కమిటీలే మూల స్తంభాలని అన్నారు. రాష్ట్రంలోని […]
TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జ్ గా మాణిక్యం ఠాకూర్ పోయి.. మాణిక్రావు ఠాక్రే వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ పార్టీకి కొత్త ఇంచార్జ్ అయితే వచ్చారు కానీ.. ఇంకా పార్టీ వ్యవహారాలలో ఆయన వేలు పెట్టలేదు. దీంతో కొత్త ఇంచార్జ్ రాష్ట్రానికి ఎప్పుడు వస్తారు? ఆయన వచ్చాక పార్టీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండనున్నాయన్న ఆసక్తి కనిపించింది. అయితే.. ఆయన రానే వస్తున్నారట. మరో నాలుగు రోజులలో తెలంగాణ కొత్త ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే […]
Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకరకమైన ఆందోళన నెలకొంది. అంతకంతకు క్రైమ్ రేట్ గణనీయంగా పెరుగుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒకవైపు దొంగతనాలు, హత్యలు, యాక్సిడెంట్లు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్యకృత్యమవగా.. మరోవైపు డ్రగ్స్ రాకెట్స్ బయటపడుతుండడంతో అసలేం జరుగుతుంది హైదరాబాద్ అన్నది అంతు చిక్కడం లేదు. నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టిన చట్టాలు తీసుకొచ్చి శిక్షలు విధిస్తుంది. నేరం ఎలాంటిదైనా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుంటున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా నిందితుల్లో మార్పు రావడం లేదు. […]
Chain Snatching: హైదరాబాద్ లో ఒకవైపు చైన్ స్నాచర్లు.. మరోవైపు దొంగలు హడలెత్తించారు. జస్ట్ రెండు గంటల సమయంలో ఏకంగా ఆరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడి ప్రజలను భయకంపితులను చేశారు. ఆ మధ్య వచ్చిన అజిత్ వలిమై సినిమాలో మాదిరి బైక్ లపై వచ్చిన దొంగలు.. మహిళల మెడల్లోని గొలుసులను లాక్కొని పరారయ్యారు. ఉప్పల్ లో మొదలైన ఈ చైన్ స్నాచింగ్ లు సికింద్రాబాద్ వరకూ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అచ్చం వలిమై సినిమా […]
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలాకాలంగా వీరసింహారెడ్డి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఆహా అన్ స్టాపబుల్ షోలో కుర్ర హీరోలతో కుర్రాడిలా కనిపిస్తున్న బాలయ్య మరోసారో సీమ బ్యాక్డ్రాప్ సినిమాలలో ఎలా ఉంటాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో దిగనున్న బాలయ్య ఇప్పటికే సినిమా ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశారు. అందులో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్ రానే వచ్చింది. ఒంగోలు అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్లో జరిగిన […]
Bandi Sanjay: శుక్రవారం సాయంత్రం నుండి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్లు కట్టి పోలీసులు భారీ బందోబస్తు చేయగా బీజేపీ కార్యకర్తలు, రైతులు వందల సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. కామారెడ్డి మునిసిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న రైతులు.. ఇండస్ట్రియల్ జోన్ కు తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని వారు స్పష్టం చేస్తున్నారు. రైతులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా […]