Mahesh Babu : ఆధార్ వెరిఫికేషన్ చేయించుకుంటున్న మహేష్ బాబు..
ఎంతటి స్టార్ డమ్ ఉన్నా చట్టం ముందు అందరూ ఒకటే అంటారు కదా. దానిని నిజం చేస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. దేశ పోరుడిగా వ్యవహరించాడు. ఒక సాధారణ వ్యక్తిగా గవర్నమెంట్ ఆఫీస్ లో హాజరయ్యి తన దేశ పౌరసత్వాన్ని ద్రువీకరించుకున్నాడు.

Mahesh Babu : ఎంతటి స్టార్ డమ్ ఉన్నా చట్టం ముందు అందరూ ఒకటే అంటారు కదా. దానిని నిజం చేస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. దేశ పోరుడిగా వ్యవహరించాడు. ఒక సాధారణ వ్యక్తిగా గవర్నమెంట్ ఆఫీస్ లో హాజరయ్యి తన దేశ పౌరసత్వాన్ని ద్రువీకరించుకున్నాడు. దేశంలో ప్రతి ఒకరికి ఆధార్ తప్పని సరి అనేది తెలిసిన విషయం. బ్యాంకు నుంచి పాన్ కార్డు వరకు ప్రతి దానికి ఆధార్ లింక్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు తన ఆధార్ వెరిఫికేషన్ కోసం స్వయంగా హైదరాబాద్ హైటెక్ సిటీకి వచ్చాడు.
SSMB28 : SSMB28 మూవీ షూటింగ్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..
హైటెక్ సిటీలోని దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ వెరిఫికేషన్ ఆఫీస్ కి మహేష్ బాబు ఎటువంటి హడావుడి లేకుండా వచ్చాడు. సైలెంట్ గా తన ఆధార్ వెరిఫికేషన్ జరిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు ఆ చిత్రాన్ని వీడియో తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది. కాగా నేడు మహేష్ తన భార్య నమ్రతతో కలిసి హాలిడే ట్రిప్ కి బయలుదేరాడు.
ఫిబ్రవరి 10న మహేష్, నమ్రతాల పెళ్లిరోజు. దీంతో వీరిద్దరూ కలిసి స్విజర్లాండ్ వెకేషన్ కి ఎంజాయ్ చేయడానికి ఈరోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం మహేష్ SSMB28 షూటింగ్ లో ఉన్నాడు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకోగా, ఇప్పుడు కొంత విరామం ఇచ్చి వెకేషన్ కి వెళ్ళాడు. ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. శ్రీలీల, పూజ హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసి ఆగష్టు తప్పకుండా రిలీజ్ చేస్తాము అంటున్నారు మేకర్స్.
.@urstrulyMahesh
Aadhar verification office#MaheshBabu #SSMB28pic.twitter.com/p3m7YEiVLS— Narsapuram Mahesh FC™ (@Narsapuram_MBFC) February 7, 2023