మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:09 PM

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

ఎస్.వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా యమలీల. యముడు అండ్ భవిష్యవాణి అనే పుస్తకం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకే రిపీట్ ఆడియన్స్ ఉంటారు. కానీ యమలీల సినిమా రిపీటెడ్ గా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతటి హిట్ సినిమాలో అలీ, ఇంద్రజల ప్లేస్ లో హీరో హీరోయిన్లుగా ఎస్.వి కృష్ణారెడ్డి ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలిస్తే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆ హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ 1 రేంజ్ లో ఉన్నవాళ్లే. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ హీరోయిన్ ఇప్పుడు ఈ భూమ్మీద లేదు. ఆ హీరో మాత్రం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోల్లో ఒకడుగా ఉన్నాడు. ఎస్.వి కృష్ణారెడ్డి ఇప్పుడు చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మహేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా రాజకుమారుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి ఒక్కో సినిమాతో అంచెలంచెలుగా ఎదిగి తన కంటూ సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తండ్రి బిరుదుని సొంతం చేసుకొని లక్షలాది మంది అభిమానుల గుండెల్లో ఆరాధ్యదైవంగా కొలువు తీరి ఉన్నాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనే రీతిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులని సృష్టించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

సౌందర్య.. తెలుగు సినిమా అనే పదానికి ఉన్న రూపాన్ని చూపించండి అని ఎవరైనా అంటే టక్కున సౌందర్య ని చూపించవచ్చు. తన నటన, రూపం, మాట తీరుని చూస్తే మన అమ్మ మనల్ని చిన్నప్పుడు నిండు జాబిలిలో ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన రోజులను గుర్తు చేసుకుంటాము. ఒకప్పుడు సావిత్రి, శ్రీదేవిలు పలానా సినిమాలో ఉన్నారని తెలిసి జనం ఆ సినిమాలకి వెళ్లేవారు. ఆ తర్వాత సౌందర్య పలనా సినిమాలో ఉందని చెప్పి జనం థియేటర్లకి వెళ్లేవారు. అంతలా సౌందర్య తన నటనతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది.

ఇంక అసలు విషయంలోకి వస్తే ఎస్.వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాలో ముందుగా మహేష్ బాబు, సౌందర్యని హీరో హీరోయిన్లుగా అనుకున్నాడంట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ఎస్.వి కృష్ణారెడ్డే చెప్పడం జరిగింది. మహేష్ బాబుని హీరోగా అనుకుంటున్నాను అని కృష్ణారెడ్డి.. సూపర్ స్టార్ కృష్ణ కి చెప్తే మహేష్ బాబు వయసు 19 సంవత్సరాలే. స్టోరీ కొంచెం హెవీగా ఉందని అన్నాడంట. సౌందర్యకి అప్పుడు 23 సంవత్సరాలు.. కృష్ణ గారు వద్దన్న కారణం వల్ల మహేష్, సౌందర్యల కాంబినేషన్ లో మూవీ సెట్ అవ్వలేదు. ఒకవేళ కృష్ణ గారు ఓకే చెప్పి వుంటే ఒక చక్కని చుక్క, చక్కని చంద్రుడి కాంబినేషన్ లో సినిమా వచ్చేది. ఆడియన్స్ సూపర్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు. మరి మీరేమంటారు.