Home » Tag » cm kcr
Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కొత్త సచివాలయం ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ముహూర్తం కూడా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు నాడే నిర్వహించనున్న ఈ వేడుకకు జాతీయ స్థాయి నేతలు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, […]
Telangana Govt: తెలంగాణలో నీటి పారుదల శాఖకి సంబంధించి మరో కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీనికోసం ఇప్పటికే ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసిన ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలలో.. లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో సభలో ప్రవేశపెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ఉన్న 18 వేర్వేరు చట్టాలను కలిపి ఒక కొత్త సమీకృత నీటిపారుదల చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముసాయిదాను కూడా సిద్ధం […]
Suicide Attempt: ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. కుటుంబం అంతా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తన భూమిని తీసుకున్న ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని.. ఉన్న భూమి పోయి బతుకుదెరువు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీం పట్నానికి చెందిన ఐలేష్ అనే వ్యక్తి భార్యతో సహా ప్రగతి భవన్ […]
Telangana: తెలంగాణ రాజకీయాలలో రెండు రాజ్యాంగపరమైన అంశాలలో ఒకరకంగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య అగాధం కాస్త ఇప్పుడు రాజ్యాంగపరమైన వివాదంగా మారింది. చిన్న చిన్న అసంతృప్తులతో మొదలైన ఈ వివాదం కాస్త ఇప్పుడు కోర్టులలో పంచాయతీల వరకు వెళ్లేలా కనిపిస్తుంది. కేంద్రంపై ఉన్న అసంతృప్తిని కేసీఆర్ సర్కార్ ఇలా గవర్నర్ పై చూపిస్తుందనే ఆరోపణలు ఉండగా.. రాజ్యాంగపరంగా తన హక్కులను సర్కార్ పట్టించుకోవడం లేదని గవర్నర్ పంతాలకు పోతున్నారని విమర్శలు […]
BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు ప్రగతిభవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్లో ఈ పార్లమెంటరీ సమావేశం జరుగనున్నది. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో చర్చింబోయే అంశాలు, బడ్జెట్లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు […]
Tamilisai Soundararajan: హైదరాబాద్ లోని రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి గణతంత్ర వేడుకలకు హాజరు కాగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని ప్రశంసించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రమని.., ప్రపంచంలోనే […]
TS Govt: తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై బుధవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. గణతంత్ర వేడుకలను రాజ్భవన్ కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ఎందుకు పాటించరని ప్రశ్నించింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర […]
Etela Rajender: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలలో సీఎం కేసీఆర్ కోవర్టులున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే ఎన్నికల కాలం.. పైగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాల్సిన సమయం. అందుకే ఒక్కో నేత ఒక్కోలా పొలిటికల్ కామెంట్స్ చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మరింత […]
Telangana Secretariat: నూతన సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో అధునాతనంగా ఈ భవన నిర్మాణం చేపట్టారు. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఎనిమిది అంతస్తులతో కూడిన భవనంలో ఆరో అంతస్తులో సీఎం సచివాలయం సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్మాణం ముగింపు దశకు చేరుకున్న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న […]
BRS Party: జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలోనే దూకుడు పెంచేందుకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఈ మధ్యనే ఖమ్మం వేదికగా మరో ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ సమరశంఖం ఊదేశారు. ఖమ్మం సభ తర్వాత పొరుగు రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ భారీ బహిరంగసభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి సంక్రాంతి తర్వాత వరసగా సభలు నిర్వహించే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ.. బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఇది కాస్త మరో నెల వెనక్కు వెళ్ళింది. […]