Hyderabad: దారుణం.. పెట్రోల్ నింపుకొని డబ్బులు ఇవ్వమంటే పిడిగుద్దులు గుద్ది చంపేశారు!

Hyderabad: పెట్రోల్ బంకులో బైకుకు పెట్రోల్ నింపుకున్న ముగ్గురు కుర్రాళ్ళు కార్డు స్వైప్ చేయమని ఇచ్చారు. అయితే, పెట్రోల్ పంపులో స్వైప్ మిషన్ పనిచేయలేదు. దీంతో పెట్రోల్ పంపు బాయ్.. తమ యజమాని తమని తిడతారని.. డబ్బులు ఇవ్వాల్సిందిగా అడగడంతో ముగ్గురు కుర్రాళ్ళు ఆగ్రహించి పిడిగుద్దులు గుద్దారు. మిగతా బాయ్స్, మిగతా వాహన యజమానులు పెట్రోల్ బాయ్ ని హాస్పటిల్ కి తరలిస్తుండగానే బాయ్ మృతిచెందాడు. రంగారెడ్డిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
హెచ్పీ పెట్రోల్ బంక్ కు బైక్ మీద వచ్చిన ముగ్గురు కుర్రాళ్ళు పెట్రోల్ పోయించుకుని స్వైప్ కార్డ్ ఇచ్చారు. అయితే, స్వైప్ మిషన్ పనిచేయలేదు. ఇంకోసారి చేయ్ అంటూ వాహనదారుడు పెట్రోల్ బాయ్ ని కోరగా అయినా అది పనిచేయకపోవడంతో పెట్రోల్ బాయ్ డబ్బులు చెల్లించమని కోరారు. అయితే వాహనదారుడు తన దగ్గర డబ్బులు లేవని కార్డు మాత్రమే ఉందన్నారు. ఎలాగోలా డబ్బులు కట్టండి లేదంటే మా ఓనర్ మామీద సీరియస్ అవుతాడని బాయ్ ఆ కుర్రాళ్ళని కోరాడు.
దీంతో ఆగ్రహించిన ఆ కుర్రాళ్ళు ముగ్గురు కలిసి బాయ్ పై దాడికి దిగారు. పిడుగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా కొట్టారు. ముగ్గురు కలిసి మూకుమ్ము డిగా దాడి చేయడంతో పాపం ఆ బాయ్ అక్కడే కుప్ప కూలిపోయాడు. ముగ్గురు కుర్రాళ్ళు బైకుపై అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడే ఉన్న కొందరు బాయ్ని ఆసుపత్రికి తరలించగా.. మార్గమద్యలోనే బాయ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన నార్సింగి జన్వాడలో చోటుచేసుకుంది.
పెట్రోల్ పోసి డబ్బులు ఇవ్వమంటే ప్రాణాలే తీసేసారంటూ మిగతా బాయ్స్ వాపోయారు. ఇలా అయితే మా పరిస్థితి ఏంటని.. పగలు రాత్రి అని తేడాలేకుండా కుటుంబం కోసం కష్టపడుతుంటే మా మీదే ఇలా దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తే మా కుటుంబాల పరిస్థితి ఏంటని తోటి వారు కన్నీరుమున్నీరవుతున్నారు. బాయ్ పై దాడి చేసిన దృష్యాలు సీసీ టీవీ కెమేరాలో రికార్డు కాగా.. దీని అధారంగా పోలీసులు కేసు నమోదు
చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.