Hyderabad: పెళ్ళైన మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. ఆమె మరో యువకుడితో చనువు.. చివరికి ఇలా!

Hyderabad: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. రోజూ జరిగే సగం నేరాలు హత్యలు, ఆత్మహత్యలలో ఈ అక్రమ సంబంధాల తాలూకూవే ఉంటున్నాయి. వివాహితులు, అవివాహితులు అనే బేధం లేకుండా మొదలవుతున్న ఈ పక్క చూపులు చివరికి కాపురాలు నాశనం చేస్తున్నాయి. మరికొన్ని విషాదాంతంగా ముగుస్తున్నాయి. ఇందులో యుక్త వయసులోని యువకులు ఎక్కువగా బలవుతున్నారు. ఈ ఘటన కూడా అలాగే విషాదంతో ముగిసింది.
19 ఏళ్ల ఓ యువకుడు డిగ్రీ చదువుతూనే ఓ షాపింగ్ మాల్ పనిచేస్తున్నాడు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడుతూ చదువుకుంటున్న యువకుడి జీవితంలోకి ఓ పెళ్ళైన మహిళ ఎంటరైంది. కొంతకాలం పాటు ఇద్దరు మధ్య వివాహేతర సంబంధం కొనసాగగా.. ఈ మధ్య ఆ మహిళ మరో యువకుడితో చనువుగా ఉంటుంది. అది చూసి తట్టుకోలేకపోయిన ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దపేట జిల్లా కూకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామానికి చెందిన అభిషేక్ (19) అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. చదువుకుంటూనే హైదరాబాద్ సుచిత్రలోని ఓ షాపింగ్ మాల్ లో పనికి కుదిరాడు. కాగా, అభిషేక్ కి అదే షాపింగ్ మాల్ లో పనిచేసే ఓ పెళ్లైన మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చివరికి వివాహేతర సంబంధంగా మారింది. అలా కొన్నాళ్ల పాటు వీరిద్దరూ ఈ వ్యవహారాన్ని సీక్రెట్ గానే నడిపించారు.
అయితే, ఇటీవల ఆ మహిళ మరొక యువకుడితో చనువుగా ఉంటుంది. పలుమార్లు ఆమెని హెచ్చరించినా మారలేదు. దీంతో అభిషేక్ తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురై నెల 17న పురుగుల మందు తాగాడు. అతని కుటుంబ సభ్యులు వెంటనే గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ బుధవారం ప్రాణాలు విడిచాడు. కుమారుడి మరణంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.