MLA Raja Singh: మరో బుల్లెట్ ప్రూఫ్ కార్.. బీజేపీ ఎమ్మెల్యేకి బిగ్ రిలీఫ్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్!

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 12:30 PM

MLA Raja Singh: మరో బుల్లెట్ ప్రూఫ్ కార్.. బీజేపీ ఎమ్మెల్యేకి బిగ్ రిలీఫ్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్!

MLA Raja Singh: కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కేసీఆర్‌ సర్కార్‌ బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చింది. ఎట్టకేలకు ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరో బులెట్ ప్రూఫ్ కేటాయించింది. తన పాత వాహనాన్ని మార్చాలని పలు మార్లు రాజా సింగ్ కోరారు. కానీ కేసీఆర్‌ సర్కార్‌ అస్సలు పట్టించుకోలేదు. తన బుల్లెట్ ప్రూఫ్ కారు పదేపదే మొరాయిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం దాన్ని మార్చడం లేదని నిరసనగా.. ఒకదశలో కొద్ది కాలం క్రితం వాహనాన్ని ప్రగతిభవన్ గేటు ఎదుట వదిలేసి వచ్చారు.

ఆ సమయంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కూడా తన బుల్లెట్ బండి మీద వచ్చి.. వినూత్న రీతిలో నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మధ్యనే తనకి పాకిస్తాన్ నుండి వాట్సాప్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేసిన రాజాసింగ్ పనిలో పనిగా తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంశాన్ని కూడా లేవనెత్తారు. ఎట్టకేలకు ప్రస్తుతం రాజాసింగ్ కు తెలంగాణ ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.

ఫార్చూనర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసు శాఖ అధికారులు సోమవారం ఆయన నివాసానికి పంపించారు. అయితే ఎమ్మెల్యే కొన్ని వ్యక్తిగత పనులపై బయటికి వెళ్లిన సమయంలో ఈ వాహనం ఆయన ఇంటికి పంపించారు. దీంతో అధికారులు అతని పాత బుల్లెట్ ప్రూఫ్‌ కారు స్థానంలో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చినట్లు పోలీసులు ఆయనకి తెలియజేశారు.

రాజా సింగ్ భద్రతా ముప్పును ఎదుర్కొంటున్నారని నివేదికలు రావడంతో గతంలో అతనికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు అందించారు. దీంతో పాటు 2 + 2 సెక్యూరిటీ కూడా ఇచ్చారు. కాగా, ఇప్పుడు ఆ వాహనం స్థానంలో మరో వాహనాన్ని రీప్లేస్ చేశారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ లేదా అంబర్‌పేట్ స్థానం నుంచి రాజాసింగ్ పోటీచేస్తారని ఎమ్మెల్యే సన్నిహిత వర్గాలు తెలిపాయి. గోషామహల్ నియోజకవర్గంలో ఆరుగురు సిట్టింగ్ బీజేపీ కార్పొరేటర్లు ఉండగా.. వారిలో కనీసం ఇద్దరు పార్టీ నుండి ఎమ్మెల్యే టిక్కెట్
ఆశిస్తున్నారు. దీంతో రాజాసింగ్ కు స్థానచలనం తప్పేలా కనిపించడం లేదు.