Yash : పాన్ ఇండియా స్టార్ ‘యష్’తో భేటీ అయిన నారా లోకేష్‌.. అందుకోసమేనా?

Kaburulu

Kaburulu Desk

December 15, 2022 | 06:45 PM

Yash : పాన్ ఇండియా స్టార్ ‘యష్’తో భేటీ అయిన నారా లోకేష్‌.. అందుకోసమేనా?

Yash : కన్నడలో సీరియల్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న నటుడు రాకింగ్ స్టార్ యష్. 2018లో ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా వైడ్ విడుదలైన ‘కెజియఫ్’ సినిమా సూపర్ హిట్టు కావడం, తరువాత వచ్చిన ‘కెజియఫ్ 2’ అంతకుమించి విజయాన్ని అందుకోవడంతో యష్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

NTR : ఫిబ్రవరిలో మొదలుకానున్న NTR30.. స్పెషల్ వీడియో రెడీ చేస్తున్న కొరటాల..

ఇంతటి పాపులారిటీని సంపాదించుకున్న ఈ హీరో.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు సడన్ గా వీరిద్దరూ ఇప్పుడు ఎందుకు కలిసారో అని సినీరాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. సుమారు అరగంటసేపు వీళ్ళిద్దరి భేటీ సాగినట్లు తెలుస్తుంది.

వచ్చే ఏడాది జనవరి 27 నుంచి రాబోయే ఎలక్షన్స్ కోసం నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టనున్నాడు. దీంతో ఈ పాన్ ఇండియా స్టార్ టీడీపీ నుంచి ప్రచారం చేయబోతున్నాడా అనే ప్రశ్న వినిపిస్తుంది. గతంలో సీనియర్ నటి సుమలత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయగా, యష్ ఆమె కోసం ప్రచారం చేశాడు.

అయితే ఈ భేటీకి సంబంధించి మరో వార్త కూడా వినిపిస్తుంది. నారా లోకేష్ మేనేజింగ్ డైరెక్టెర్ గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ కు యష్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజమన్నది తెలియాలి అంటే పత్రికా ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.