Allu Arjun : హైదరాబాద్ లైవ్ కాన్సర్ట్‌లో ‘డీజే’గా అల్లు అర్జున్.. సర్‌ప్రైజ్ అయిన ఆడియన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాలో తన మ్యానరిజంతో ఇంటర్నేషనల్ స్టార్స్ ని కూడా తన ఫాలోవర్స్ గా చేసుకొని రియల్ గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా పుష్ప మానియానే కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ శనివారం (మార్చి 4) రాత్రి ఒక లైవ్ కాన్సర్ట్ లో అల్లు అర్జున్ డీజేగా దర్శనమిచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు.

Kaburulu

Kaburulu Desk

March 5, 2023 | 11:44 AM

Allu Arjun : హైదరాబాద్ లైవ్ కాన్సర్ట్‌లో ‘డీజే’గా అల్లు అర్జున్.. సర్‌ప్రైజ్ అయిన ఆడియన్స్!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాలో తన మ్యానరిజంతో ఇంటర్నేషనల్ స్టార్స్ ని కూడా తన ఫాలోవర్స్ గా చేసుకొని రియల్ గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా పుష్ప మానియానే కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ శనివారం (మార్చి 4) రాత్రి ఒక లైవ్ కాన్సర్ట్ లో అల్లు అర్జున్ డీజేగా దర్శనమిచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. నెదర్లాండ్స్ కి చెందిన ప్రముఖ డీజే సింగర్ మార్టిన్ గ్యారిక్స్ ఈ శనివారం హైదరాబాద్ లో లైవ్ కాన్సర్ట్ ఇచ్చాడు. ఈ కాన్సర్ట్‌ కి ఎంతోమంది యువత హాజరయ్యారు.

Ram Charan : సినిమాలకు కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుందాం అనుకున్నా.. రామ్‌చరణ్!

ఇక తన మ్యూజిక్ తో మార్టిన్ అందర్నీ అలరిస్తున్న సమయంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీంతో మార్టిన్ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా ఊ ఊ అంటావా మామా’ సాంగ్ ని ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, మార్టిన్ తో కలిసి డీజే వాయిస్తూ, స్టెప్పులు వేసి ఆడియన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు అల్లు అర్జున్ షేర్ చేస్తూ.. మార్టిన్ గ్యారిక్స్ తో మంచి ఫన్ నైట్. తగ్గేదెలా అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బన్నీ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లి వచ్చాడు. త్వరలోనే కొత్త షెడ్యూల్ లో పాల్గొనున్నాడు. వచ్చే నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండడంతో.. ఆ రోజున పుష్ప-2 నుంచి పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్ వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవలే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్రకటించాడు అల్లు అర్జున్. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మాణంలో భూషణ్ కుమార్ నిర్మాతగా ఈసినిమా తెరకెక్కనుంది.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)