Pushpa 2 : పుష్ప-2 అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి..

స్టార్ హీరోయిన్ రష్మిక మందన సౌత్ టూ నార్త్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు 'వరిసు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 05:48 PM

Pushpa 2 : పుష్ప-2 అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి..

Pushpa 2 : స్టార్ హీరోయిన్ రష్మిక మందన సౌత్ టూ నార్త్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 20న డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది ఈ భామ. ఇక సౌత్ లో ‘వరిసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది.

Pushpa 2 : పుష్ప-2లో రామ్‌చరణ్ అతిధి పాత్ర?

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. తమిళంలో సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రష్మికను పుష్ప-2 గురించి ప్రశ్నించగా, ఆమె బదులిచ్చింది. ఫిబ్రవరి నుండి పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ షెడ్యూల్ లో తను కూడా పాల్గొంటున్నట్లు చెప్పుకొచ్చింది. మళ్ళీ తిరిగి పుష్ప ఫ్రాంచైజ్ లో జాయిన్ అవుతుండడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటూ వ్యాఖ్యానించింది.

2021 చివరిలో విడుదలైన పుష్ప ది రైజ్ చిత్రం అనుకోని రీతిలో పాన్ ఇండియా వైడ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు, మ్యానరిజం అయితే వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యినవి. దీంతో ఈ చిత్రాన్ని ఇటీవల రష్యాలో కూడా విడుదల చేశారు మేకర్స్. ఇక మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్టు అవ్వడంతో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ నెలకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ సెకండ్ పార్ట్ లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. సునీల్, అనసూయ, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.