Home » Author » M N
TDP-YSRCP: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ పాదయాత్రలో భాగంగా ఒక చోట మీడియా సమావేశం నిర్వహించగా.. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లోకేష్ తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరితో పాటు మంచి మనసు కలిగిన వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. దీనిపై అప్పటి నుండే వైసీపీ మూకుమ్మడి దాడి మొదలు […]
Gannavaram: వధువు మహిళా వాలంటీర్.. ఈ నెల 22న పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ఇంట పెళ్లి సందడి నెలకొంది. తెల్లారి పెళ్లి అనగా బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతుంది. కానీ, ఇంతలోనే పిడుగులాంటి వార్త వధువు ఇంటికి చేరింది. తమకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. అందుకే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు వరుడి కుటుంబం నుంచి రాయబారం వచ్చింది. ఆశ్చర్యపోయిన వధువు సహా కుటుంబ సభ్యులు ఎందుకిలా చేశారని వరుడి కుటుంబాన్ని నిలదీశారు. వధువు పనిచేసే సచివాలయంలోని […]
Kuppam Road Accident: కారు-లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కుప్పం సమీపంలో జరిగింది. జిల్లాలోని గుడుపల్లె మండలంలోని కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై చిన్నశెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఫలితంగా కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా అనుమానిస్తున్నారు. మృతులు కడప, నెల్లూరు వాసులుగా పోలీసులు […]
Doctors Neglect: ఈమధ్య కాలంలో కొన్ని ఆసుపత్రులలో వైద్యం, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. రకరకాల రోగాలతో ఆసుపత్రులకు వెళ్లే ప్రజలను కాపాడాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణపాయ పరిస్థితులకు గురిచేస్తున్నారు. అలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ళ క్రితం ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. దీంతో అప్పటి నుండి కత్తెర ఆ మహిళ […]
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అధికార పార్టీ వైసీపీ నానా తిప్పలు పడుతుంది. ఒకరికి ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పెద్దఎత్తున సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ తెగ ఆయాస పడుతుంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి […]
Telangana TDP: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. ఆ మధ్య ఖమ్మంలో టీడీపీ సభ తర్వాత తెలంగాణ టీడీపీలో కాస్త జోష్ కనిపించింది. అయితే, ఖమ్మం సభ తర్వాత సైలెంట్ అయిపోవడంతో పార్టీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇకపై ఏదొక రీతిన ప్రజలలోకి వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ […]
Earthquake in Japan: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు భూకంప ప్రభావం టెర్రర్ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల నుండి వివిధ దేశాలలో భారీ ఎత్తున భూకంపాలు సంభవిస్తున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీన టర్కీ, సిరియా దేశాలలో సంబంధించిన భూకంపం ప్రభావంతో అక్కడ వేలాది మంది శిధిలాల కింద సమాధిగా కాగా.. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. మళ్లీ కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో భూకంపం రాగా పదుల సంఖ్యలో మరణించారు. వందల సంఖ్యలో గాయాల […]
Hyderabad Police: ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు లేపేసే దొంగలు, షాపింగ్ మాల్స్ వద్ద.. వివిధ పనుల మీద బయటకి వెళ్ళినపుడు సెంటర్లు, చౌరస్తాలలో బైక్ అలా పెట్టి వెళ్లి వచ్చేసరికి బైకులు మాయం చేసే ముఠాలు మెట్రో నగరాలలో కోకొల్లలు ఉంటుంటాయి. హైదరాబాద్ లో అయితే తరచుగా ఏదో ఒక మూలాన ఇలాంటి దొంగతనాలు బయటపడుతూనే ఉంటాయి. అలాగే పదేళ్ల క్రితం తన బైక్ పోగొట్టుకున్న యజమానికి ఇక అది దొరకదని ఆశలు వదిలేసుకున్నాడు. […]
Viral News: కొంతమంది చదువు లేకపోయినా తెలివిలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటుంటారు. ఒక్కోసారి పల్లెల్లో కూలి పనికి వెళ్లే ఆడవారి బ్రెయిన్ కూడా అయస్కాంతంలా పనిచేయడం చూసి అవాక్కవుతుంటాం. ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా అలాంటిదే. తన నాటు కోడి కాలును పక్కింటి వాళ్ళు విరగ్గొట్టారని ఓ మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడ పోలీసులతో పాటు ఇతరత్రా వారు అడిగిన ప్రశ్నలకు ఆ మహిళ చెప్పిన సమాధానం విని అందరూ […]
YSRTP: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేసి సీఎం కేసీఆర్ ఒక నియంతలా పాలిస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉన్నదంతా గూండాలేనని, ప్రతిపక్షాలపై వారు దాడులు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. దేశంలో భారత రాజ్యాంగం అమల్లో ఉంటే, తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర […]