Home » Author » M N
Shamshabad: తెలంగాణలో మరో దారుణం జరిగింది. మహిళలపై అఘాత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చట్టాలను తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోతోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు చిన్న, పెద్ద తేడా లేకుండా, వావి వరసలు చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతూ మహిళల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఒక రకంగా మనుషుల కంటే క్రూర మృగాలే నయం అనిపిస్తుంది. జంతువుల కంటే దారుణంగా కొంతమంది దుర్మార్గులు చెలరేగిపోతున్నారు. రెండు, మూడు ఏళ్ల చిన్నారుల నుండి 50, 60 […]
Delhi Liquor Scam: ఈ నెల 20న సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందేనని ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈనెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేనని కవిత ఈడీకి లేఖ రాసినా గురువారం మధ్యాహ్నం వరకు ఈడీ నుండి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ వ్యవహారంలో కొంత […]
Weather Update: తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుంది. మరికొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తుంది. హైదరాబాద్ లోని ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, లంగర్హౌజ్, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఆరాంఘర్లో వర్షం కురుస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, జహీరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వడగళ్ల వాన దంచికొడుతోంది. […]
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముందని తెలిసింది. గురువారం రాత్రి 7:30 గంటలకు సీఎం జగన్ హస్తినకు పయనం కానున్నారు. అయితే, ఓవైపు నేడు రాష్ట్ర […]
Myanmar Military: మయన్మార్లో మరోసారి మారణకాండ జరిగింది. మయన్మార్ సైన్యానికి, తిరుగుబాటుదారులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు సన్యాసులు కూడా ఉన్నారు. దక్షిణ షాన్ రాష్ట్రంలోని ఓ ఆశ్రమంలో శనివారం రోజున సైన్యం మద్దతు గల జుంటాకు, తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు జరిగిన ఘటన ఆలస్యంగా ప్రపంచం దృష్టికి వచ్చింది. శనివారం ఈ ఘటన జరిగినట్లు మయన్మార్ అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ ఘటనలో అనేక […]
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ విచారణకు రాలేనని తన ప్రతినిధిని ఈడీ ఆఫీస్కు పంపారు కవిత. కవిత హాజరుకాకపోవడంపై న్యాయవాది సోమా భరత్ ఈడీకి వివరాలు తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని.. ఈడీ విచారణకు హాజరుకాలేనని న్యాయవాదుల ద్వారా ఈడీకి సమాచారం పంపారు కవిత. అనారోగ్య కారణాలు కూడా ఉండడంతో మరోరోజు విచారణ తేదీ నిర్ణయించాలని కవిత అభ్యర్థన […]
AP Assembly Sessions: ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కీలక బడ్జెట్ అసెంబ్లీ ముందుకు వస్తోంది. జగన్ ప్రభుత్వం ఈ విడతలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుండగా.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక శాసనమండలిలో […]
Gudivada Amarnath: పవన్ కళ్యాణ్ది జనసేన కాదు కమ్మసేన అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఏ ఉద్దేశంతో తాజాగా సభను పెట్టారో పవన్ కే తెలియదని ఎద్దేవా చేసిన అమర్నాథ్.. జెండా పవన్ ది.. అజెండా తెలుగుదేశం పార్టీదని విమర్శించారు. 175కి 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కు లేదని.. జనసేనకు రాజకీయ సిద్ధాంతమే లేదని అన్నారు. భారత్ కు స్వాతంత్రం […]
Vemula Prashanth Reddy: టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన అనంతరం ఏపీలో కూడా పాగా వేస్తారని.. ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ వలసలు ఉంటాయని భావించిన సంగతి తెలిసిందే. అయితే, ఏమైందో ఏమో కానీ కేసీఆర్ అండ్ కో ఏపీలో పార్టీ కార్యకలాపాలపై కాస్త ఆలోచనలో పడ్డట్లు కనిపించింది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు కూడా కనిపించడం లేదు. తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ మధ్య ఏపీ గురించి వ్యాఖ్యలు కూడా చేయడం […]
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. రెండో రోజే సభలో నిరసనలు, ఆందోళనలకు, సస్పెన్షన్స్ చోటుచేసుకున్నాయి. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. గవర్నర్ విషయంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా సమయం వృథా చేశారంటూ పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేయాలని బుగ్గన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. స్పీకర్ […]