Home » Author » Abhilash Myadam
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన సరస్వతి దేవి ఆలయం బాసర జ్ఞానసరస్వతి ఆలయం. ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం, బాసరలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదేనని చెప్పుకోవచ్చు. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఈ ఆలయంలో వసంత పంచమి వేడుకలు చాలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సరస్వతి దేవి జన్మించిన రోజైన వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. […]
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకోవడం భక్తులు ఎంతో పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రముఖ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దేవాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహాకాళేశ్వరుడిని భారత జెండాలోని త్రివర్ణ పతాకంతో అలంకరించబడి భక్తులను దేవ, దేశ భక్తి పారవశ్యంలో ముంచివేశారు. దైవ భక్తి, దేశ భక్తి ఒకేచోట ఆవిష్కృతమైన ఆ వేళ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని జ్యోతిర్లింగ మహాకాళేశ్వర ఆలయంలో మహాకాళ భగవానుడిపై త్రివర్ణ పతాకం కనిపించింది. గణతంత్ర దినోత్సవం […]
ఉత్తరాంధ్రప్రదేశ్ లో కొలువుతీరిన కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఈరోజు వైభవంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా నిర్వహించే సిరిమానోత్సవంను వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా పోటెత్తారు. మరి ఈ జాతర విశేషాలేమిటో, జాతరలో జరిగే వివిధ కార్యక్రమాలు ఏమిటో, వారి ఆచారాలు ఏమిటో, ప్రత్యేకతలేమిటో ఇపుడు తెలుసుకుందాం. ప్రతి ఏటా శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో గల సంబరపురాలో సంక్రాంతి వెళ్లిన మొదటి వారం […]
అష్టాదశ శక్తిపీఠాలో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో జరగబోయే బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత ఏంటో, అక్కడి సాంప్రదాయం, ఆచారాలను గురించి, బ్రహ్మోత్సవాల సమయసారిణి గురించి ఇపుడు తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదిగా, తెలంగాణలో ఏకైక శక్తి పీఠంగా, దక్షిణ కాశీగా ప్రాచుర్యం పొందిన అలంపూర్ బాల బ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 26 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. రజాకార్ల సమయంలో జోగులాంబ అమ్మవారి మూలవిరాట్టును […]
టీటీడీ నిర్వహిస్తున్న ‘పారాయణం’ కార్యక్రమాలు ప్రతి వ్యక్తిని చేరాలంటే సరైన సలహాలు అవసరం కాబట్టి చాగంటి కోటేశ్వరరావును నియమించడం ద్వారా అనుకున్న ఫలితం పొందుతామని. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం జరిగిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డిపిపి), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబిసి) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన […]
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అన్న పేరుతో పిలుస్తారు. కారణమేమంటే బ్రహ్మోత్సవాలకు సమానమైన వేడుకలు ఈ రోజున జరుపుతారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. మరి ఆ వివరాలేంటో ఇపుడు తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల అయిన మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. పూజలకు శుభకార్యాలకు మాఘ మాసం […]
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందే నాగోబా జాతర. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవుడు. ఈరోజు నుంచి అత్యంత […]
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ అయినట్లు తెలుస్తుంది. డ్రోన్ కెమెరాలో తీసిన శ్రీవారి ఆలయ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఐకాన్ అనే ఇన్స్టాగ్రమ్ అకౌంట్ నుండి ఈ వీడియోలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. దీనితో అలిపిరి నుండి శ్రీవారి ఆలయం వరకు, తిరుమలలోని మిగతా అన్నీ పరిసరాలన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటాయి. ఎక్కడికక్కడ సిసి కెమెరాల నిఘా ఉంటుంది. […]
ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భాగంగా మనదేశం నుండి స్వామి వివేకానంద చికాగో సభలో హాజరయిన విషయం అందరికి తెలిసిందే. కానీ అక్కడ వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసం ద్వారా చాలామంది ప్రజలు ఆకర్షణకు గురై సన్నిహితులుగా మారారు. అక్కడి ప్రజలు కొందరు హిందూ ధర్మం విశిష్టతను తెలుసుకొని దేవాలయాలు నిర్మించి పూజించడం మొదలుపెట్టారు. అటువంటి దేవాలయాల్లో ఒకటైన చికాగో రామాలయం విశేషాలను గురించి ఇపుడు తెలుసుకుందాం. ఇల్లినాయిస్ రాష్ట్రంలోలోని లెమోంట్లోలో ఉన్న చికాగో రామాలయంను 1977లో స్థాపించారు. దేవాలయ […]
హిందూ దేవాలయాలకు, హిందూ మతానికి భారతదేశం అతి పెద్ద దేశం అని చాలా మంది ప్రజలు అనుకుంటారు. హిందూ దేవాలయాలు ఇండియాలో ఉన్నంతగా మరే దేశంలో కూడా లేవని కొందరు అభిప్రాయ పడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇండియాలో హిందువులు ఎక్కువ ఉన్నారన్న మాట వాస్తవమే, ప్రస్తుతం ఇండియాలోనే దేవాలయాల సందర్శన ఎక్కువ ఉంటుంది అది కూడా నిజమే. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయమైన అంగ్ కోర్ వాట్ దేవాలయం మాత్రం కాంబోడియా నగరంలో ఉంది. దాని […]