Tricolour of Indian flag ascended on Lord Mahakal: గణతంత్ర దినోత్సవ వేళ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ధరించిన త్రివర్ణ తిలకం..!
![Tricolour of Indian flag ascended on Lord Mahakal: గణతంత్ర దినోత్సవ వేళ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ధరించిన త్రివర్ణ తిలకం..!](https://kaburulu.com/wp-content/uploads/2023/01/Tricolour-of-Indian-flag-ascended-on-Lord-Mahakal.jpg)
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకోవడం భక్తులు ఎంతో పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రముఖ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దేవాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహాకాళేశ్వరుడిని భారత జెండాలోని త్రివర్ణ పతాకంతో అలంకరించబడి భక్తులను దేవ, దేశ భక్తి పారవశ్యంలో ముంచివేశారు. దైవ భక్తి, దేశ భక్తి ఒకేచోట ఆవిష్కృతమైన ఆ వేళ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని జ్యోతిర్లింగ మహాకాళేశ్వర ఆలయంలో మహాకాళ భగవానుడిపై త్రివర్ణ పతాకం కనిపించింది. గణతంత్ర దినోత్సవం 74వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఉజ్జయినిలో మహాకాళ ప్రత్యేక అలంకారం జరిగింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు మహాకాళ దేవుడిని త్రివర్ణ పతాకంతో అలంకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రోజంతా మహాకాళ భగవానుడిపై దేశభక్తి నిండిపోయింది. ఈ అద్భుత అలంకరణను చూసేందుకు భక్తులు కూడా ఉత్సాహం కనబరిచారు.
నిత్యం మహాకాళేశ్వర ఆలయంలో ఉదయం 4:00 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆ తరువాత దేవతా మూల మూర్తులకు నీరు, పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, నెయ్యి మొదలైన, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత మహాకాల అలంకరణ ప్రారంభమవుతుంది. ఈ అలంకరణలో వివిధ రకాలైన దండలు, డ్రై ఫ్రూట్స్, ఇతర పూజా సామగ్రిని ఉపయోగిస్తారు. కానీ ప్రత్యేక రోజైన నేటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా త్రివర్ణ తిలకం దిద్దడం అద్భుతంగా ఉందని భక్తులు తెలుపుతున్నారు.