Home » Author » Abhilash Myadam
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలు మన దేవాలయాలు. అటువంటి దేవాలయాలలో ఒకటే కర్ణాటకలో అతిపురాతమైన చరిత్ర ఉన్న బేలూరు దేవాలయం. యగాచి నది ఒడ్డున దక్షిణకాశీగా పేరు పొందిన బేలూరు పట్టణం హొయసల రాజులకు రాజధానిగా ఉండేది. ఎన్నో ప్రాచీనమైన, ప్రముఖ దేవాలయాలకు బేలూరు పట్టణం కేంద్రంగా నిలిచింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పట్టణంలో గల హొయసల రాజులు నిర్మించిన చెన్నకేశవ స్వామి దేవాలయంలోనే ఈ తిరిగే స్తంభం ఉంది. ఆనాటి రాజుల కళాపోషణకు దేవాలయం […]
శాతవాహనులతో సామంతులుగా ఉండి క్రమంగా స్వతంత్ర్య రాజ్యం ఏర్పర్చుకున్న పల్లవులు అనేక శిల్పసంపదను మనకు అందించారు. పల్లవుల రాజధానిగా పిలువబడే కాంచీపురం ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం. ఈ క్షేత్రంలోని కైలాసనాథ దేవాలయాన్నే పల్లవులు రాతి మీద నిర్మించిన తొలి దేవాలయంగా చెబుతారు. ఈ ఆలయం గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు ఇపుడు తెలుసుకుందాం. పల్లవులు ఈ ఆలయాన్ని క్రీ.శ. 567 వ సంవత్సరంలో నిర్మించారు. ఆ తర్వాత ఏడో శతాబ్ద కాలంలో పల్లవ రాజు రెండో నరసింహ […]
భారతదేశం శిల్పకళా సంపదకు, దేవాలయాలకు పెట్టింది పేరు. మన దేశంలో దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి తంజావూరు. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీపై తంజావూరు ఉంది. చరిత్ర కారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది. ఇక్కడే ఎంతో ప్రాచీనమైన ఆలయాలలో […]
ఒక స్త్రీని శక్తి రూపంగా భావించి పూజించే సంస్కృతి మన హిందూ సంప్రదాయంలో తప్ప ఇంకెక్కడా కనిపించదు. అందుకే మన పెద్దలు “యత్రనార్యన్తు పూజ్యన్తే రమంతే తత్ర దేవతః” అన్నారు, అంటే స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడే అందరు దేవతలూ ప్రసిద్ధులవుతారు అని అర్థం. ఆ శక్తి రూపాన్నే మనం భవానీ, మహాంకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక వంటి ఎన్నో పేర్లతో పూజిస్తాం కానీ అగ్నినే ఒక శక్తిగా, అమ్మవారిగా భావించే ఆలయమొకటుందన్న […]
ఆ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయం, సాయంత్రం గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు తాకుతాయి. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఇక్కడి మూర్తి అభయ ముద్రలో ఉంటాడు. ఆ ఆలయమేదో మీకు తెలుసా…? అయితే ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోండి. సంవత్సరానికి రెండు సార్లు సూర్యకిరణాలు మూలవిరాట్టు విగ్రహ పాదాలకు సోకేలా నిర్మించిన ఆలయం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామి దేవాలయం. అరసవల్లి […]
ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడే దేవాలయం గురించి విన్నారా…? ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్లీ మాములుగా తయారవుతుంది. ఇది చదివేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా అక్షరాలా సత్యం. మరి ఈ ఆలయాన్ని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి… హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిని దగ్గర్లో ఉన్న కులుకు కు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘బిజిలీ […]
విజ్ఞాలను తొలగించే విఘ్నేశ్వరుడు, గణాలకు అధిపతి గణపతి, ఏనుగు ముఖం గల వాడు గజాననుడు, నాయకులలో విశిష్టమైన వాడు వినాయకుడు… ఇలా మనం ఎన్నో పేర్లతో పిలిచే పార్వతీ పుత్రుడిని ముందుగా పూజించాకనే ఏ శుభకార్యమైనా మొదలు పెడతాం.. మరి వినాయకుడిని కమండల గణపతి అని ఎక్కడ పిలుస్తారో? ఎందుకు పిలుస్తారో ఇపుడు తెలుసుకుందాం…! అసలు వినాయకుడికి కమండల గణపతి అని పేరు రావడానికి గల కారణం ఏమిటి అంటే… ఇక్కడి స్థల పురాణం ప్రకారం శని […]
సాధారణంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతునికి నైవేద్యం సమర్పించి మిగిలిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. కానీ సమర్పించిన నైవేద్యం సాక్షాత్తు భగవంతుడు భుజించడం ఎక్కడా చూసుండరు… అటువంటి ఆలయం కూడా ఒకటుంది.. ఎక్కడో తెలుసా… కేరళలోని తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం. ఇక్కడి ఆలయంలో కొలువైన శ్రీ కృష్ణుడు భక్తులు పెట్టే నైవేద్యం స్వయంగా తింటాడు. ఇక్కడి ఇంకో ప్రత్యేకత ఏంటంటే అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత దీపారాధన చేసే ఏకైక దేవాలయం ఇది. ఈ ఆలయంలో ఉన్న శ్రీ కృష్ణడు ఎంతో ఆకలిగా […]
శ్రీవాణి ట్రస్ట్ వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆఫ్ లైన్ టికెట్ల సెంటర్ ను తిరుపతి ఎయిర్పోర్టులో ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే లభించనున్నాయి. టికెట్ల కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, గతంలో శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయలు విరాళం ఇచ్చి టికెట్ […]
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర దేవాలయం. ఈ దేవాలయం లో గల నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లో కూడా ఈ నంది ప్రస్తావన ఉంది. అంతకంతకూ పెరిగిన నంది విగ్రహం రంకె వేస్తే కలియుగం అంతరించి పోతుందని వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానం లో పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయం విశేషాలు […]