Chardham Yatra: వాట్సాప్ ద్వారా కూడా చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్…! ఎలానో తెలుసా…?

చార్ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 21 ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైనందున చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకున్నవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రిజస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్లోని యమునోత్రి , గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాల సందర్శన యాత్రను చార్ధామ్ అంటారని మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
- చార్ ధామ్ యాత్రకు వెళ్లానుకునేవారు రిజిస్ట్రేషన్ కోసం registrationandtouristcare.uk.gov.in అనే వెబ్సైట్కు వెళ్లాలి.
- అనంతరం చార్ధామ్ యాత్ర 2023 ఆన్లైన్ రిజిస్ట్రేషన్/లాగిన్ ఫారమ్ను యాక్సెస్ చేయడానికి, రిజిస్టర్/లాగిన్పై క్లిక్ చేయండి.
- అనంతరం మీ పేరు, అడ్రస్ తదితర వివరాలు నింపాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్ లేదా ఈమెయిల్కు OTP వస్తుంది.
- OTP ద్వారా లాగిన్ అవ్వాలి.
- అనంతరం యాడ్/మేనేజ్ పిల్గ్రిమ్స్ లేదా టూరిస్ట్లపై క్లిక్ చేయండి.
- ఆపై పర్యటన రకం, పర్యటన పేరు, యాత్ర తేదీలు, పర్యాటకుల సంఖ్య, ప్రతి గమ్యస్థానం సందర్శించవలసిన తేదీ వంటి టూర్ ప్లాన్ వివరాలను నమోదు చేయండి.
- అలా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్తో SMS అందుకుంటారు. చార్ధామ్ యాత్ర ప్రయాణం కోసం రిజిస్ట్రేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోగలుగుతారు.
వాట్సప్ ద్వారా:
వాట్సప్ ద్వారా చార్ధామ్ యాత్రను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం 8394833833 వాట్సాఫ్ నంబర్కు ‘Yatra’ అని మెసేజ్ చేయండి. ఆ తర్వాత సిస్టమ్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి జవాబు ఇస్తే చాలు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే. అలాగే చార్ధామ్ యాత్ర కోసం టోల్ ఫ్రీ నంబర్ 01351364 కూడా అందుబాటులో ఉంది.