Chardham Yatra: వాట్సాప్ ద్వారా కూడా చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్…! ఎలానో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

February 24, 2023 | 10:22 PM

Chardham Yatra: వాట్సాప్ ద్వారా కూడా చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్…! ఎలానో తెలుసా…?

చార్‌ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 21 ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైనందున చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకున్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి , గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాల సందర్శన యాత్రను చార్‌ధామ్ అంటారని మనకు తెలిసిందే.  అయితే ప్రస్తుతం కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

  1. చార్ ధామ్ యాత్రకు వెళ్లానుకునేవారు రిజిస్ట్రేషన్ కోసం registrationandtouristcare.uk.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
  2. అనంతరం చార్‌ధామ్ యాత్ర 2023 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/లాగిన్ ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి, రిజిస్టర్/లాగిన్‌పై క్లిక్ చేయండి.
  3. అనంతరం మీ పేరు, అడ్రస్ తదితర వివరాలు నింపాలి.
  4. రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్ లేదా ఈమెయిల్‌కు OTP వస్తుంది.
  5. OTP ద్వారా లాగిన్ అవ్వాలి.
  6. అనంతరం యాడ్/మేనేజ్ పిల్‌గ్రిమ్స్ లేదా టూరిస్ట్‌లపై క్లిక్ చేయండి.
  7. ఆపై  పర్యటన రకం, పర్యటన పేరు, యాత్ర తేదీలు, పర్యాటకుల సంఖ్య, ప్రతి గమ్యస్థానం సందర్శించవలసిన తేదీ వంటి టూర్ ప్లాన్ వివరాలను నమోదు చేయండి.
  8. అలా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్‌తో SMS అందుకుంటారు. చార్‌ధామ్ యాత్ర ప్రయాణం కోసం రిజిస్ట్రేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారు.

వాట్సప్ ద్వారా:

వాట్సప్ ద్వారా చార్‌ధామ్ యాత్రను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం 8394833833 వాట్సాఫ్ నంబర్‌కు ‘Yatra’ అని మెసేజ్ చేయండి. ఆ తర్వాత సిస్టమ్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి జవాబు ఇస్తే చాలు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే. అలాగే చార్‌ధామ్ యాత్ర కోసం టోల్ ఫ్రీ నంబర్ 01351364 కూడా అందుబాటులో ఉంది.