Heart Attack: కబళిస్తున్న గుండెపోటు.. స్నేహితులతో ఆడుకుంటుండగానే 19 ఏళ్ల యువకుడు మృతి!

Heart Attack: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడు ఎవరిని మట్టుబెడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వయస్సు పైబడిన వారికి, అతిగా లావుగా ఉన్నవారికి మాత్రమే వస్తుందని అనుకునేవారు. కానీ, ఇప్పుడు ఈ మహమ్మారి అంచనాలను తలకిందులు చేస్తోంది. చిన్న పిల్లలకు, యువకులకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడిన వారు నిలబడే కూలిపోతున్న ఘటనలు రోజూ పేపర్లలో, న్యూస్ ఛానళ్లలో చూస్తూనే ఉన్నాం.
ఈ మధ్యనే బరాత్ లో డాన్స్ చేస్తున్న యువకుడు అలాగే కుప్పకూలి మృతి చెందాడు. ఏపీలో గత వారం మరో యువకుడు అలాగే మరణించాడు. నిన్నటికి నిన్న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో సోమవారం రాత్రి అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పి భోజనం చేసి నిద్రపోయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుండె పోటుకి గురై ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
అదలా ఉండగానే ఏపీలోని అనంతపురం జిల్లాలో మరో యువకుడు గుండెపోటుకు గురయ్యాడు. జిల్లాలోని మడకశిర మండలం అచ్చంపల్లి తాండాకు చెందిన తనూజ నాయక్ పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. తాజాగా తనూజ నాయక్ తన ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ గ్రౌండ్ లో కబడ్డీ ఆడుతుండగా ఒక వైపు వెళ్తూ వెళ్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని తీసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్ ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.
బెంగుళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనూజ నాయక్ తాజాగా ప్రాణాలు విడిచాడు. 19 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురై తనూజ నాయక్ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం తనూజ నాయక్ కబడ్డీ ఆడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, యువకులలో వరసగా కనిపిస్తున్న గుండెపోటు కలవరపెడుతుంది.