Taraka Ratna : తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ హీరో మరియు రాజకీయ వేత్త నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశారు.

Taraka Ratna : టాలీవుడ్ హీరో మరియు రాజకీయ వేత్త నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. జనవరి నెలలో టీడీపీ లీడర్ నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లిన తారకరత్న.. ఆ కార్యక్రమంలో నడుస్తూ నడుస్తూనే కుప్పకూలిపోయారు. ఇక అప్పటినుంచి దాదాపు 22 రోజులు పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ ల్లో చికిత్స పొందుతూ వచ్చారు. కోమాలోకి వెళ్లిపోయిన తారకరత్న మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18 న కన్నుమూశారు.
Nara Lokesh : నేను బాలకృష్ణ ఫ్యాన్ కాదు, చిరంజీవి ఫ్యాన్.. నారా లోకేశ్!
ఆయన మరణం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడిని సృష్టించింది. ముఖ్యంగా నందమూరి కుటుంబం వరుస మరణాలతో కృంగిపోయింది. ఇక తారకరత్న మరణాన్ని.. ఆయన భార్య పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. తారకరత్న పార్థివదేహం దగ్గర ఆయన కూతురు భోరున విలపిస్తుంటే అందరి హృదయాలు బరువు ఎక్కాయి. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మరణ వార్త తెలిసిన దగ్గర నుంచి ఆహారం తీసుకోవడం మానేసింది. ఆమె మానసికంగా చాలా సిక్ అయ్యిందని విజయ్ సాయి రెడ్డి మీడియాకి కూడా తెలియజేశాడు.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశారు. ”కలిసి జీవించడానికి చాలా పోరాడాము, చివరి వరకు పోరాడుతూనే ఉన్నాము. మన జీవితం పూలబాట కాదు. కార్లలో పడుకోవడం నుండి ఇక్కడ వరకు చాలా దూరం ప్రయాణించం. నువ్వొక యోధుడు నానా. మమల్ని నువ్వు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు” అంటూ తారకరత్న చెయ్యి పట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. అలేఖ్య రెడ్డి, తారకరత్న 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అలేఖ్య రెడ్డి కూడా సినీ పరిశ్రమంలోనే పని చేసేవారు. పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ డిపార్ట్మెంట్ లో అలేఖ్య పనిచేసింది. కాగా తారకరత్న పిల్లల పూర్తి బాధ్యత తాను తీసుకుంటాను అని విజయ్ సాయి రెడ్డికి బాలకృష్ణ మాట ఇచ్చాడని, విజయ్ సాయి రెడ్డి తెలియజేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram