Nayanatara : కవల పిల్లలకి జన్మనిచ్చిన నయనతార.. షాక్ లో జనాలు..

Kaburulu

Kaburulu Desk

October 9, 2022 | 03:46 PM

Nayanatara : కవల పిల్లలకి జన్మనిచ్చిన నయనతార.. షాక్ లో జనాలు..

Nayanatara :  స్టార్ హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల జూన్ 9, 2022న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. లైఫ్ ని ఫారెన్ ట్రిప్స్ వేస్తూ, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. తాజాగా ఈ జంట కవలపిల్లలకు జన్మనిచ్చాము అని షాక్ ఇచ్చారు.

విగ్నేష్ శివన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇద్దరు కవల పిల్లలని విగ్నేష్ శివన్, నయనతార ముద్దులు పెడుతున్న ఫోటోలని పోస్ట్ చేసి.. ”నయనతార, నేను అమ్మానాన్నలు అయ్యాం. మాకు కవల పిల్లలు జన్మించారు. మా ప్రార్థనల వల్ల, మా పూర్వీకుల ఆశీర్వాదం వల్ల అన్ని కలిసి మాకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. మా ఉయర్, ఉలగంకి మీ ఆశీస్సులు కావాలి” అని పోస్ట్ చేశారు.

Anchor Vrashini : వర్షిణి పెళ్లి చేసుకోబోతుందా?? ఆ లక్కీ బాయ్ ఎవరో??

దీంతో పెళ్లి అయిన మూడు నెలలకే తల్లి తండ్రులయ్యారు అనడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే వీరు ముందుగానే ప్లాన్ చేసుకొని సరోగసి ద్వారా పిల్లలని కన్నట్టు సమాచారం. ఇలా పిల్లలని పెళ్ళికి ముందే ప్లాన్ చేసుకొని పెళ్లి అయిన మూడు నెలలకి పిల్లలు అని ప్రకటించడంతో అనడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.