Nayan-Vignesh : ముగిసిన నయనతార సరోగసి వివాదం.. నయన్ దంపతులకి తమిళనాడు ప్రభుత్వం క్లీన్ చీట్..

Nayan-Vignesh : స్టార్ హీరోయిన్ నయనతార, విగ్నేష్ శివన్ జూన్ లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత హనీమూన్ వెళ్లొచ్చి షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ఇటీవల కొన్ని రోజుల క్రితం తమకు కవలలు పుట్టారని ఇద్దరు పిల్లల పాదాలని ముద్దాడుతూ నయన్, విగ్నేష్ ఓ ఫోటోని షేర్ చేశారు.
కొంతమంది శుభాకాంక్షలు తెలపగా, కొంతమంది మాత్రం పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లలు ఎలా అని ప్రశ్నించారు. సరోగసి అయితే రూల్స్ పాటించలేదు అంటూ కొంతమంది నయన్ దంపతులని విమర్శించారు. ఇది పెద్ద వివాదంగా మారడంతో తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య శాఖ దీన్ని సీరియస్ గా తీసుకొని నయన్ దంపతులకి నోటీసులు ఇచ్చారు. అలాగే ఈ అంశంపై ఓ విచారణ కమిటీ వేశారు.
తాజాగా ఆ విచారణ కమిటీ ఇచ్చిన నివేదికతో వివాదం ముగిసింది. ఈ నివేదికలో.. ”నయనతార, విఘ్నేష్ శివన్ 2016లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మన భారతదేశ సరోగసి రూల్స్ ప్రకారం పెళ్లి అయి ఐదేళ్లు పూర్తయింది. దానికి సంబంధించిన రిజిస్టర్ మ్యారేజ్ పత్రాలని కూడా సమర్పించారు. అలాగే వారికి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా వారు సరోగసిని ఎంచుకున్నారు. దానికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ కూడా అందచేశారు. అలాగే దుబాయ్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో అయి అక్కడే సరోగసి ద్వారా పిల్లలని కన్నారు” అని తెలిపారు.
దీంతో ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నయనతార దంపతులు అన్ని రూల్స్ పాటించి సరోగసి ద్వారా పిల్లలని కన్నారని క్లీన్ చిట్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.