Vijay Devarakonda : లైగర్ ఫ్లాప్ తర్వాత మొదటిసారి మాట్లాడిన విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న స్పీచ్
![Vijay Devarakonda : లైగర్ ఫ్లాప్ తర్వాత మొదటిసారి మాట్లాడిన విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న స్పీచ్](https://kaburulu.com/wp-content/uploads/2022/10/vijay-devarakonda.jpg)
Vijay Devarakonda : ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అది చాలదన్నట్టు చిత్ర యూనిట్, విజయ్ దేవరకొండ సినిమాపై మరింత హైప్ పెంచారు. ప్రమోషన్స్ లో సినిమా గురించి ఓవర్ గా చెప్పి ఆకాశానికెత్తేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హైప్ కి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు సినిమా. దారుణమైన పరాజయం పొందింది.
లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ అసలు మీడియా ముందుకు రాలేదు. ఏ ఈవెంట్ కి కూడా రాలేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టీవ్ గా లేడు. తాజాగా సైమా అవార్డ్స్ వేడుక జరగగా ఆ ఈవెంట్ కి విచ్చేశాడు విజయ్ దేవరకొండ. ఈవెంట్ లో మాట్లాడిన స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. సైమా అవార్డ్స్ లో యూత్ ఐకాన్ ఫర్ సౌత్ అనే అవార్డు విజయదేవరకొండకి ఇచ్చారు. ఈ అవార్డు అందుకోవడానికి విజయ్ విచ్చేశాడు.
Nayanatara : కవల పిల్లలకి జన్మనిచ్చిన నయనతార.. షాక్ లో జనాలు..
విజయ్ దేవరకొండ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ”సైమా అవార్డ్స్ అందుకున్న వారందరికీ కంగ్రాట్స్. మీరంతా మంచి హిట్ సినిమాలిచ్చి పరిశ్రమని ముందుకి తీసుకెళ్లారు. నేను కూడా హిట్ సినిమా ఇవ్వాలనుకున్నాను. దానికి బాగానే కష్టపడ్డాను కాని ఫలితం దక్కలేదు. అందరికి మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. అసలు ఈ ఈవెంట్ కి రాకూడదు అనుకున్నాను. కానీ మీ వల్లే ఈ అవార్డు నాకు వచ్చింది కాబట్టి అవార్డు తీసుకోడానికి వచ్చాను. మీ అందర్నీ ఎంటర్టైన్ చేస్తాను అని ప్రామిస్ చేస్తున్నాను” అని చెప్పాడు. దీంతో ఈ స్పీచ్ వైరల్ గా మారింది.
The One and Only Versatile Actor 🥰😎#VijayDeverakonda 🤗@TheDeverakonda pic.twitter.com/Cvaahvh4oG
— Dileep Kushi Rowdy (@Dileep35777546) October 10, 2022