Sannidhanam PO : శబరిమల నేపథ్యంలో సినిమా.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ప్రారంభం..

గతంలో అయ్యప్పస్వామి మహత్యాన్ని చూపిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఈ సారి శబరిమల, శబరిమల చుట్టూ ఉన్న ప్రదేశాలు, శబరిమల పోస్ట్ ఆఫీస్ నేపథ్యంలో సరికొత్త కథనంతో ఓ పాన్ ఇండియా సినిమాని..............

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 01:57 PM

Sannidhanam PO : శబరిమల నేపథ్యంలో సినిమా.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ప్రారంభం..

Sannidhanam PO :  గతంలో అయ్యప్పస్వామి మహత్యాన్ని చూపిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఈ సారి శబరిమల, శబరిమల చుట్టూ ఉన్న ప్రదేశాలు, శబరిమల పోస్ట్ ఆఫీస్ నేపథ్యంలో సరికొత్త కథనంతో ఓ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళ నటుడు యోగిబాబు, కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘సన్నిధానం PO’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సర్వదా సినీ గ్యారేజ్, షీమోన్‌ క్రియేషన్స్‌ నిర్మాణంలో రాజీవ్‌ వైద్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాని శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సంక్రాంతికి దర్శకుడు, నయనతార భర్త విగ్నేష్ శివన్ అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ విగ్నేష్ శివన్ శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఈ సినిమాకి క్లాప్ కొట్టి షూటింగ్ ని ప్రారంభించారు.

Bhola Shankar : భోళాశంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరంజీవి.

సన్నిధానం PO అనే ఆసక్తికర టైటిల్ తో, శబరిమల అంశాలతో సినిమా తెరకెక్కుతుండటంతో అయ్యప్ప భక్తులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించారు.