Sannidhanam PO : శబరిమల నేపథ్యంలో సినిమా.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ప్రారంభం..
గతంలో అయ్యప్పస్వామి మహత్యాన్ని చూపిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఈ సారి శబరిమల, శబరిమల చుట్టూ ఉన్న ప్రదేశాలు, శబరిమల పోస్ట్ ఆఫీస్ నేపథ్యంలో సరికొత్త కథనంతో ఓ పాన్ ఇండియా సినిమాని..............
![Sannidhanam PO : శబరిమల నేపథ్యంలో సినిమా.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ప్రారంభం..](https://kaburulu.com/wp-content/uploads/2023/01/sabarimala.jpg)
Sannidhanam PO : గతంలో అయ్యప్పస్వామి మహత్యాన్ని చూపిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఈ సారి శబరిమల, శబరిమల చుట్టూ ఉన్న ప్రదేశాలు, శబరిమల పోస్ట్ ఆఫీస్ నేపథ్యంలో సరికొత్త కథనంతో ఓ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళ నటుడు యోగిబాబు, కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘సన్నిధానం PO’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సర్వదా సినీ గ్యారేజ్, షీమోన్ క్రియేషన్స్ నిర్మాణంలో రాజీవ్ వైద్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాని శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సంక్రాంతికి దర్శకుడు, నయనతార భర్త విగ్నేష్ శివన్ అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ విగ్నేష్ శివన్ శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఈ సినిమాకి క్లాప్ కొట్టి షూటింగ్ ని ప్రారంభించారు.
Bhola Shankar : భోళాశంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరంజీవి.
సన్నిధానం PO అనే ఆసక్తికర టైటిల్ తో, శబరిమల అంశాలతో సినిమా తెరకెక్కుతుండటంతో అయ్యప్ప భక్తులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించారు.