Nayan-Vignesh : నయనతారకి పెళ్లయి ఆరేళ్లయిందా??

Kaburulu

Kaburulu Desk

October 17, 2022 | 11:37 AM

Nayan-Vignesh : నయనతారకి పెళ్లయి ఆరేళ్లయిందా??

Nayan-Vignesh :  స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని కొన్ని నెలల క్రితం జూన్‌ 9న మహాబలిపురంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు సార్లు హనీమూన్ కి కూడా వెళ్లొచ్చారు ఈ జంట. ఇటీవల ఈ జంట తమకి కవల పిల్లలు పుట్టారని అందరికి షాకిచ్చారు.

పెళ్లయి నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే పిల్లలు ఎలా అని కొంతమంది ప్రశ్నిస్తుంటే సరోగసి ద్వారా కన్నట్టు సమాచారం వచ్చింది. అయితే మన దేశంలో సరోగసి ద్వారా పిల్లల్ని కనాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని అతిక్రమిస్తే అది ఇల్లీగల్ గా కౌంట్ చేసి నేరంగా పరిగణిస్తారు. ముఖ్యగా సరోగసి ద్వారా పిల్లలు కనాలంటే పెళ్లయి అయిదేళ్ల వరకు కూడా పిల్లలు పుట్టకపోతే అప్పుడు సరోగసి తీసుకోవాలి. కానీ నయన్ విషయంలో ఇది జరగకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకి నోటీసులు పంపింది. పిల్లలు ఎలా పుట్టారో క్లారిటీ ఇవ్వాలని కోరింది లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Praseeda : కృష్ణంరాజు మరణం తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన కూతురు ప్రసీద..

దీంతో నయన్ దంపతులకి శిక్ష తప్పదా అని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నయన్ దంపతులు సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరికి ఆరేళ్ళ క్రితమే పెళ్లి అయినట్టు చెప్తున్నారంట. ఈ వివాదంలో బయటపడాలంటే ఇదొక్కటే మార్గమని భావించి అలా చెప్తున్నారంట. ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని, దానికి సంబంధించిన పత్రాలు కూడా అందచేస్తామని తెలిపినట్టు తమిళ మీడియా సమాచారం. మరి నయన్, విగ్నేష్ నిజంగానే ఆరేళ్ళ క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా లేక ఈ వివాదం నుంచి బయటపడటానికి దీన్ని సృష్టిస్తున్నారా తెలియాల్సి ఉంది.