Viral News: బైక్‌పై జంట రొమాన్స్.. వీడియో వైరల్.. పోలీసులు ఏం చేశారో తెలుసా?!

Kaburulu

Kaburulu Desk

February 9, 2023 | 09:26 AM

Viral News: బైక్‌పై జంట రొమాన్స్.. వీడియో వైరల్.. పోలీసులు ఏం చేశారో తెలుసా?!

Viral News: ఈ మధ్య కాలంలో ఆకతాయి యువత తెగ రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్‌ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్‌ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌, యూపీలోని లఖ్‌నవూ, చత్తీస్‌గఢ్‌లో కొందరు యువ జంటలు బైక్‌, కారుపై రొమాన్స్‌ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్‌ అయ్యాయి కూడా.

తాజాగా రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఓ జంట బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. రీజనల్‌ కాలేజ్‌ క్రాస్‌ రోడ్స్‌-నౌసర్‌ వ్యాలీ రహదారిలో ఓ జంట బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. యువకుడు తన ప్రియురాల్ని పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చోబెట్టుకుని, ఆమెతో రొమాన్స్ చేస్తూ బైక్ నడిపాడు. ఈ దృశ్యం చూసి తోటి వాహనదారులు ఖంగుతిన్నారు.

ఈ క్రమంలోనే ఒకరు వెంటనే మొబైల్ తీసి, వారి బాగోతాన్ని వీడియో తీశారు. ఆ వెంటనే సోషల్ మీడియాలో వీడియో పెట్టి.. పోలీసులకు ఫిర్యా దు చేశారు. వీడియో ఆధారంగా అజ్మీర్‌ క్రిష్టియన్‌ గంజి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైడర్‌ ఫై సాగర్‌ రోడ్‌కు చెందిన సాహిల్‌గా గుర్తించిన పోలీసులు.. అతడి బైక్‍ను సీజ్ చేశారు.

గత నెల జనవరి 21వ తేదీన ఛత్తీస్‍గఢ్‍లోని భిలాయ్‍లో ఓ యువ జంట ఇలాగే బైక్‍పై రొమాన్స్ చేసింది. యువకుడు బైక్ నడపగా.. యువతి ట్యాంక్‍పై అతడి ముందు కూర్చొంది. అదే నెల 17వ తేదీ ఉత్తర ప్రదేశ్‍లోని లక్నోలో ఓ స్కూటీపై ఇలాంటిది జరిగింది. నడుస్తున్న స్కూటీపైనే ఆ యువ జంట రెచ్చిపోయింది. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‍గా కాగా పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని గుర్తించారు. అది చూసినా మళ్ళీ ఇప్పుడు రాజస్థాన్ జంట అదే చేసి చిక్కులు కొనితెచ్చుకున్నారు.