Thunderstorm Rain: ఒడిశాలో పిడుగుల వాన బీభత్సం.. అరగంటలో 5450 పిడుగులు..ఐదుగురి మృతి!

Thunderstorm Rain: ఒడిశాలో పిడుగుల వాన భీబత్సం సృష్టించింది. అరగంటపాటు ఏకధాటిగా కురిసిన పిడుగుల వానతోతో జనం బెంబేలెత్తిపోయారు. తెరిపిలేకుండా పడిన పిడుగుల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రక్ జిల్లా బాసుదేవపూర్లో బుధవారం సాయంత్రం జరిగిందీ ఘటన. అరగంట వ్యవధిలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. ఆగకుండా వస్తున్న పిడుగుపాటు శబ్దాలకు ప్రజలు భయంతో వణికిపోయారు.
అయితే, ఇలా జరగడం కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు గోపాల్పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారులు చెబుతున్నారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుందని అన్నారు. కాగా సుందర్గఢ్, కియోంజర్, సుందర్గఢ్, మయూర్భంజ్, బాలాసోర్, కటక్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ సమయంలో బలమైన గాలులు, పిడుగు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
మెరుపు ఫ్లాష్ అనే పదం మొత్తం పిడుగు భూమి మీదకు చేరే సమయాన్ని తెలియజేస్తుంది.. ఇది 0.2 సెకన్ల క్రమాన్ని తీసుకుంటుంది. కానీ ఒక ఫ్లాష్ సాధారణంగా అనేక చిన్న డిశ్చార్జలతో రూపొందుతుంది.. ఇది మిల్లీ సెకన్ల కంటే తక్కువగా ఉంటుంది… బహుళ సంఘటనలను కన్ను గుర్తించలేనంత వేగంగా పునరావృతమవుతుంది..ఈ ఉత్సర్గలను స్ట్రోక్స్ అంటారు.. కొన్నిసార్లు స్ట్రోక్లను గుర్తించడానికి తగినంత సమయంలో వేరు చేస్తారు.. మెరుపు మెరుస్తున్నట్లు కనిపిస్తుంది’ అని ఉమాశంకర్ దాస్ తెలిపారు.
పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద తలదాచుకోవద్దని భాతర వాతావరణ శాఖ సూచించింది. మధ్యధరా ప్రాంతంలో ఉష్ణమండల తుఫాను కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని రోజులుగా ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఢిల్లీలోనూ గురువారం భారీ వర్షం కురిసింది.