Anasuya : మాట్లాడుతూ మీడియా ముందు ఏడ్చేసిన అనసూయ..

రంగమార్తాండ సినిమా ఉగాది కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మంగళవారం నాడు చిత్రయూనిట్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించగా సినిమాలో నటించిన వాళ్లంతా ఈ ప్రెస్ మీట్ కి వచ్చి తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో అనసూయ సినిమా గురించి మాట్లాడుతూ...................

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 03:04 PM

Anasuya : మాట్లాడుతూ మీడియా ముందు ఏడ్చేసిన అనసూయ..

Anasuya :  దర్శకుడు కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మరాఠి సినిమా నటసామ్రాట్ కి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో నటించగా బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రాజా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూలు చూసిన వాళ్లంతా సినిమా చాలా బాగుందని, ఎమోషనల్ గా ఉందని అంటున్నారు.

రంగమార్తాండ సినిమా ఉగాది కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మంగళవారం నాడు చిత్రయూనిట్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించగా సినిమాలో నటించిన వాళ్లంతా ఈ ప్రెస్ మీట్ కి వచ్చి తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో అనసూయ సినిమా గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

Das Ka Dhamki : రిలీజ్ రోజు విశ్వక్‌సేన్ సినిమా కోసం థియేటర్‌కి వెళ్తే.. రవితేజ సినిమా వేశారు..

అనసూయ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రమోషన్స్ లో నేను కృష్ణవంశీ గారిని కంగారు పెట్టేదాన్ని. ఆయనేమో మనం ఎక్కువగా చేయక్కర్లేదు, సినిమానే మాట్లాడుతుంది అనేవారు. ఇప్పుడు నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను రంగమార్తాండ లాంటి గొప్ప సినిమా చేసినందుకు. నేను ఆల్రెడీ సినిమా చూశాను. సినిమాలో నటించాను కదా ఎమోషనల్ అవ్వను అని ప్రివ్యూ చూడటానికి వెళ్ళాను. కానీ సినిమా చూసిన తర్వాత ఏడ్చేసాను. ఈ జీవితానికి ఇది చాలు అనిపించింది. చాలా మంచి సినిమాలో నటించాను అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేసింది అనసూయ. మీడియా ముందే అనసూయ ఎమోషనల్ ఏడవటంతో ఈ వీడియో వైరల్ గా మారింది.