Home » Author » M N
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళి సై నడుస్తూ నడుస్తూ కాలు జారి కిందపడిపోయారు. తమిళనాడులో ఆదివారం జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె నడుస్తుండగా స్లిప్ కావడంతో కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై ఆదివారం తమిళనాడులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళిసై భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ […]
YSRCP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ముందుగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా.. ఈ మధ్యనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 16 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. జూలైలో గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలు భర్తీకానున్నాయి. మొత్తమ్మీద 18 ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త వారు కొలువుదీరనున్నారు. ఇందులో పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తప్పించి.. మిగతావి వైసీపీకి దక్కే ఛాన్స్ ఉంది. […]
Nara Lokesh Padayatra: టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పాదయాత్ర 14వ రోజున అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే, పాదయాత్రకు బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురయ్యారు. దీనితో అతడిని హుటాహుటీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ రమేష్ మృతి […]
Viral News: ఈ మధ్య కాలంలో ఆకతాయి యువత తెగ రెచ్చిపోతున్నారు. పబ్లిక్గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్గానే రొమాన్స్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, యూపీలోని లఖ్నవూ, చత్తీస్గఢ్లో కొందరు యువ జంటలు బైక్, కారుపై రొమాన్స్ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి కూడా. తాజాగా రాజస్థాన్లో అజ్మీర్లో ఓ జంట బైక్పై రొమాన్స్ చేస్తూ […]
AP Capital: : ఏపీ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏపీ రాజధాని వ్యహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై […]
Nara Lokesh: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 ఎంత వివాదం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు నానా యాగీ చేసి చివరికి హైకోర్టులో కూడా స్టే తీసుకొచ్చాయి. అయితే ఆ స్టే గడువు ఉందా లేదా అనేది తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం జీవోను అమలు చేస్తుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో స్వల్ప […]
Revanth Reddy: ప్రగతి భవన్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో మంట పెట్టాయి. నక్సలైట్లు బాంబులు పెట్టి.. ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి ములుగు నుండి హాత్ సే హాత్ జోడో యాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ములుగు జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. రెండో రోజు బహిరంగ సభలో మాట్లాడారు. […]
Viral News: అక్కచెల్లెల్లు అంటే అనుబంధానికి, అప్యాయతలకు మారు రూపం అనిచెప్పుకుంటారు. కష్ట సుఖాలను పంచుకుంటూ ఒకరికొకరుగా మెలుగుతారు. కానీ, వన్స్ పెళ్ళైతే భర్తే సర్వస్వంగా.. నేనూ, నా భర్త సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కష్ట సుఖాలలో అక్క చెల్లెళ్ళు తోడుగా ఉంటారు కానీ.. భర్తను పంచుకోవడం అనేది ఊహించుకున్నా ఉగ్రరూపం బయటకి వచ్చేస్తుంది. ఆ మాటకొస్తే ఏ స్త్రీకి అయినా తన భర్త తనకే సొంతం.. తనకే సర్వస్వం అనుకొనేలా ఉంటారు. అప్పుడప్పుడు అక్కాచెల్లెళ్లు అనుకోకుండా […]
TS Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం.. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సరిపోగా.. ఆ తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య అసలైన యుద్ధం మొదలైంది. ఒకవైపు కాంగ్రెస్ లో సీనియర్ నేతలు.. మరోవైపు బీజేపీ నేతలు, మజ్లీస్ నేతలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండగా.. అధికార పార్టీ నేతలు అందుకు ధీటుగా బదులిస్తున్నారు. మొత్తంగా బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బుధవారం చర్చలో భాగంగా బీజేపీ […]
AP Govt: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. మోడల్ స్కూల్, ఏపీఈఆర్ఐఎస్ ఉద్యోగుల విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుపై కేబినెట్లో చర్చ జరిగింది. అలాగే జిందాల్ స్టీల్కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, విశాఖలో పెట్టుబడుల సదస్సుపైనా కేబినెట్లో చర్చ జరిగింది. విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ […]