Revanth Reddy: ప్రగతి భవన్ను నక్సలైట్లు పేల్చేయాలి.. రేవంత్ వ్యాఖ్యలపై పోలీస్ కంప్లైంట్!

Revanth Reddy: ప్రగతి భవన్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో మంట పెట్టాయి. నక్సలైట్లు బాంబులు పెట్టి.. ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి ములుగు నుండి హాత్ సే హాత్ జోడో యాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ములుగు జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. రెండో రోజు బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభలో సీఎం కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ సీఎం కేసీఆర్ పై చేస్తున్న విమర్శలలో.. ప్రజలకు ప్రవేశంలేని ప్రగతి భవన్ను పేల్చేయాలంటూ చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. నక్సలైట్లు ప్రగతిభవన్ ను గ్రెనేడ్లతో పేల్చేసినా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. పేదలకు కేసీఆర్ ఇళ్లు ఇవ్వలేదు గానీ.. హైదరాబాద్ నడిబొడ్డున పది ఏకరాలల్లో 2000 కోట్లతో 150 గదుల ప్రగతి భవన్ నిర్మించుకున్నారని విమర్శించారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ఎందుకన్నారు.
ఆనాడు గడీలను గ్రానేట్లతో పేల్చిన నక్సలైట్లు.. బాంబులతో ప్రగతిభవన్ను పేల్చేయాలంటూ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. బహిరంగగా ఒక సీఎంను చంపేయాలని ఒక ఎంపీ నక్సలైట్లకు పిలుపునివ్వడం ఏంటని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే రేవంత్రెడ్డిపై ములుగు, నర్సంపేటల్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు.
కేసీఆర్కు ప్రాణహాని తలపెట్టేలా రేవంత్ రెడ్డి నక్సలైట్లకు పిలుపునిచ్చారని.. రేవంత్ నక్సలైట్లతో లోపాయికారి ఒప్పందం చేసుకొని సీఎం కేసీఆర్ కుట్రకు పన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ములుగు స్థానిక ఎమ్మెల్యే, మాజీ నక్సలైట్ సీతక్క అలియాస్ అనసూయ నక్సలైట్లతో మధ్యవర్తితం చేసి కుట్ర పన్నినట్లు తమకు అనుమాలున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ ఫిర్యాదులలో పేర్కొన్నారు.